| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ప్రమాదాల నివారణ సామాజిక బాధ్యత: కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి

ప్రమాదాల నివారణ సామాజిక బాధ్యత: కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి

ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ... సీటుబెల్ట్, హెల్మెట్ ధరించాలి

ప్రమాదంలో యువతే ఎక్కువ ప్రాణాలు కోల్పోవటం బాధాకరం

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతీ ఒక్కరి బాధ్యత అన్నారు మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి. 

ట్రాఫిక్ పోలీసులు, చలాన్లు రాస్తున్నారని సీటు బెల్ట్, హెల్మెట్ ధరించటం మంచి పరిణామమే అయినా... సామాజిక బాధ్యతగా అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలి... యువకులకు అవగాహన కల్పించాలని కేఎల్ఆర్ కోరారు.

తుక్కుగూడ కార్యాలయంలో 2024కు బైబై చెబుతూ... 2025కు స్వాగతం పలికేందుకు ఆసక్తి చూపుతున్న యువతీయువకులకు పలు సూచనలు చేశారు.

దేశవ్యాప్తంగా 1.70లక్షల మంది ఏడాదిలో ప్రాణాలు కోల్పోగా... అందులో యువకులే 60 శాతమంది ఉన్నారని కిచ్చెన్న వెల్లడించారు.

తెలంగాణలో ఈ ఏడాదిలో రోడ్డు ప్రమాదాలు 20,702 జరగ్గా... 6వేల 500 మంది ప్రాణాలు కోల్పోయి.. వేలాది మంది గాయపడ్డారని లక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 

చట్టాలను గౌరవించటం, ట్రాఫిక్ రూల్స్ పాటించటం, స్కూల్ సహా యాక్సిడెంట్ స్పాట్లను గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. మెట్రో నగరాల్లోనే ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతున్నాయని నిద్రలేని, రోడ్డు గుంతలు, పశువులు, పొగమంచు, అతివేగం సహా మద్యం మత్తులో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని నివేదికలు చెబుతున్నాయని కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి చెప్పారు. విధిగా సీట్ బెల్డ్ పెట్టుకోవటం కనీస బాధ్యత అన్నారు. పోలీసులు, రవాణాశాఖ సంయుక్తంగా చేస్తున్న ప్రయత్నాలు, కఠిన నియమ, నిబంధనలు పాటిస్తే... వాహనదారులు ప్రమాదాలకు దూరమై... కుటుంబాలు సంతోషంగా ఉంటాయని కేఎల్ఆర్ తెలిపారు. 

2025లో కొత్త ఆలోచనలతో యువత, పార్టీ నాయకులు భవిష్యత్ లక్ష్యాలు ఏర్పరుచుకోవాలని సూచించారు.

Previous పోచమ్మ తల్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన బీఆర్ఎస్ యువ నాయకులు వై. రవీందర్ యాదవ్
Next తల్లిదండ్రులు సెల్ ఫోన్ కొనివ్వలేదనే కారణంతో యువకుడు ఆత్మహత్య
ADVERTISEMENT