Posted on 2024-10-30 07:59:58
డైలీ భారత్, మహబూబాబాద్: స్థానిక జిల్లా కేంద్రంలోని ఆదర్శ పాఠశాల మరియు జూనియర్ కళాశాలకు చెందిన నలుగురు విద్యార్థులు ఎస్ జి ఎఫ్ ఐ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో వివిధ రకాల క్రీడలలో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక అయ్యారు అని ప్రిన్సిపాల్ జి. ఉపేందర్ రావు తెలిపారు. రాష్ట్రస్థాయి కి ఎంపికైన వారిలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరిగిన అథ్లెటిక్స్ పోటీలలో సెకండ్ ఇయర్ సిఈసి విద్యార్దిని డి. హరిక U/19 విభాగంలో 3000 మిటర్ల లో ప్రథమ స్థానం, ఫస్ట్ ఇయర్ ఎంపీసీ విద్యార్థి B. సతీష్ U/19 విభాగం 3000 మిటర్ల లో ప్రథమ స్థానం సాధించి సరూర్ నగర్ లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అదేవిధంగా ఏ. రామ్ దీక్షిత్ U/17 విభాగంలో బాస్కెట్ బాల్ లో కేసముద్రం లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కావడం జరిగింది. అదే విదంగా జి. శ్రీ చరణ్ 9 వ తరగతి విద్యార్థి ఉర్షు విభాగంలో కేసముద్రంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కావడం జరిగింది అని ప్రిన్సిపాల్ జి. ఉపేందర్ రావు తెలిపారు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక అయిన విద్యార్దులను ప్రిన్సిపాల్ జి. ఉపేందర్ రావు, ఫిజికల్ డైరెక్టర్ కె ఏస్ వర్మ , బాస్కెట్ బాల్ కోచ్ కుమార స్వామి మరియు ఉపాధ్యాయ బృందం అభినందించారు.
నాయకపోడు కులస్థులకు ప్రత్యేక సీరియల్ నెంబర్ కేటాయించాలనీ డిమాండ్
Posted On 2026-04-20 18:40:20
Readmore >
గంజాయి సరఫరా చేస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసిన ఆత్మకూరు పోలీసులు
Posted On 2026-04-20 18:18:28
Readmore >
ఏకలవ్య పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-04-20 15:16:27
Readmore >
విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు యాంటీ-ర్యాగింగ్ అవగాహన కార్యక్రమం : డీఎస్పీ వెంకటేశ్వర్లు
Posted On 2026-04-20 13:57:43
Readmore >
బిజెపి పార్టీలో చేరిన సుమారు 100 మంది కాంగ్రెస్ పార్టీ మరియు బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు ప్రతినిధులు
Posted On 2026-04-20 13:41:10
Readmore >