Posted on 2024-10-22 18:43:38
డైలీ భారత్ రాజన్న సిరిసిల్ల: పట్టణంలోని ప్రదీప్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ రంగంలో ఖాళీల భర్తీ కోసం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు హెచ్ ఆర్ హెడ్ వినయ్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు గురువారం ఉదయం 10 గంటలకు స్థానిక మహతి మహిళా డిగ్రీ కళాశాల ప్రాంగణంలో మేళ నిర్వహించబడుతుంది అన్నారు హెచ్ డి ఎఫ్ సి ముత్తూట్ ఫిన్ కార్ప్ కంపెనీలో సిరిసిల్ల జగిత్యాల కరీంనగర్ శాఖలో ఖాళీలను ఈ మేళా ద్వారా భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు కనీసం 50% మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువతీ యువకులు మేళాలో పాల్గొనవచ్చు అన్నారు స్క్రీనింగ్ పరీక్షలు అనంతరం ఎంపికైన వారికి ఏడాదికి 2.5 లక్షల వేతనం లభిస్తుంది అన్నారు వయసు గల నిరుద్యోగ యువత మేళలో పాల్గొనేందుకు అర్హులుగా పేర్కొన్నారు ఆసక్తిగల యువత తమ విద్యార్హతల ధ్రువీకరణ పత్రాలు జిరాక్స్ సెట్ ఆధార్ కార్డు లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన ఇతర గుర్తింపు కార్డుతో నేరుగా మేళాకు హాజరు కావచ్చును అన్నారు పూర్తి వివరాల కోసం 83 74 22 18 04 సెల్ నెంబర్ ను సంప్రదించాలని సూచించారు
ప్రతి ఇంటి సమాచారం నమోదు… మన అందరి ప్రథమ కర్తవ్యం... జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా
Posted On 2026-04-24 22:25:39
Readmore >
బూర్గంపాడు మండలం : పేకాట స్థావరాలపై సిసిఎస్ పోలీసులు మెరుపు దాడి
Posted On 2026-04-24 22:18:33
Readmore >
ద్విచక్ర వాహనం చోరి నిందితులను చాకచక్యంగా పట్టుకున్న జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి, సిబ్బంది
Posted On 2026-04-24 19:11:00
Readmore >