డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: రాష్ట్ర మరియు వైరా నియోజకవర్గ ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి లకావత్ గిరిబాబు
దసరా పండుగను పురస్కరించుకొని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి వైరా నియోజకవర్గ నాయకులు లకావత్ గిరిబాబు రాష్ట్ర మరియు వైరా నియోజకవర్గ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సాంస్కతిక జీవన విధానంలో దసరాకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. విజయానికి చిహ్నంగా దసరా పండుగను విజయదశమి పేరుతో దేశ వ్యాప్తంగా జరుపుకుంటారని వివరించారు. దుర్గామాత కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలనీ, ప్రజలందరికీ సుఖ సంతోషాలను ప్రసాదించాలని లకావత్ గిరిబాబు దుర్గామాతను ప్రార్థించారు.