డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: రంగారెడ్డి జిల్లా నూతన గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ గా నియమితులైన ఎలుగంటి మధుసూదన్ రెడ్డి గురువారం సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. తనపై నమ్మకం ఉంచి గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ గా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని అన్ని గ్రంథాలయాలను అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తామన్నారు. ప్రభుత్వం ఈ పదవీ ఇవ్వడం సంతొషంగా ఉందన్నారు.ఇంకా కష్టపడి ప్రజల మన్ననలు పొందుతూ వాళ్లకు సహాయ పడుకుంటూ ప్రభుత్వం పరంగా ఏ సహాయమైనా చేయడానికి తను కృషి చేస్తానని ఎలుగంటి మధు సూదన్రెడ్డి తెలిపారు. పేద ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చిన వెనువెంట ఉంటూ వాళ్లకు సాయ పడేందుకు ముందుంటానని పేర్కొన్నారు.
News
సీఎంను కలిసిన రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్