Posted on 2024-10-09 00:38:19
ఎంపీఓకి వినతి పత్రం అందిస్తున్న దృశ్యం
డైలీ భారత్, పాల్వంచ: తోగూడం ఏజెన్సీ ప్రాంతంలో రాజ్యాంగం కల్పించిన గిరిజన చట్టాలు అపహాస్యమవుతున్నాయని సేవాలాల్ సేన అభ్యంతరం వ్యక్తం చేసింది. మంగళవారం సేవాలాల్ సేన మండలాధ్యక్షుడు జర్పుల పరమేష్ నేతృత్వంలో నాయకులు మండల పంచాయతీ అధికారి బొగ్గ నారాయణకు సమస్యలతో కూడిన వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా పరమేష్ మాట్లాడుతూ.. ఏజెన్సీలో గిరిజన హక్కుల ఉల్లంఘన జరుగుతుందన్నారు. తోగూడెంలో కొద్దిమంది గిరిజనులను మచ్చిక చేసుకున్న గిరిజనేతరులు క్వారీల ఏర్పాటుతో కోట్ల వ్యాపారం నిర్వహించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అనుమతి లేని క్వారీలతో నిత్యం వ్యాపారం చేస్తున్నా.. అధికార యంత్రంగం ప్రేక్షక పాత్రకు పరిమితమవడం ఆందోళన కలిగిస్తుందన్నారు. ఎన్ని క్వారీలకు గ్రామపంచాయతీ తీర్మానాలు ఇచ్చిందో, వివరాలు తెలపాలని కార్యదర్శి, ఎంపీఓలకు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు.
కార్యక్రమంలో సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షుడు మాలోత్ శివ నాయక్, శ్రీను నాయక్, రమేష్ నాయక్, సంతోష్ లు న్నారు.
ప్రతి ఇంటి సమాచారం నమోదు… మన అందరి ప్రథమ కర్తవ్యం... జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా
Posted On 2026-04-24 22:25:39
Readmore >
బూర్గంపాడు మండలం : పేకాట స్థావరాలపై సిసిఎస్ పోలీసులు మెరుపు దాడి
Posted On 2026-04-24 22:18:33
Readmore >
ద్విచక్ర వాహనం చోరి నిందితులను చాకచక్యంగా పట్టుకున్న జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి, సిబ్బంది
Posted On 2026-04-24 19:11:00
Readmore >