| Daily భారత్
Logo




కుమారుని జ్ఞాపకార్థం భోజన ప్లేట్లు నోటు పుస్తకాలు పంపిణీ చేసిన తల్లిదండ్రులు

News

Posted on 2024-09-20 21:33:25

Share: Share


కుమారుని జ్ఞాపకార్థం భోజన ప్లేట్లు నోటు పుస్తకాలు పంపిణీ చేసిన తల్లిదండ్రులు

డైలీ భారత్, నర్సింహులపేట:మండలంలోని లలితండకు చెందిన గుగులోతు భీముడు - పద్మ కుమారుడు చంద్రకాంత్ ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందగా తమ కుమారుని 28వ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో తమ కుమారుని జ్ఞాపకార్థం సుమారు 200 మంది విద్యార్థులకు భోజనం ప్లేట్లు, పెన్నులు, నోట్ పుస్తకములు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భీముడు కుటుంబ సభ్యులు మాట్లాడుతూ నా కుమారుడు అకస్మాత్తుగా మా నుండి దూరమై మమ్మల్ని ఒంటరివారిని చేసి వెళ్లిపోయాడని వాపోయారు. మా కుమారుడు జ్ఞాపకార్థం మా వంతు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు భోజన ప్లేట్లను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఇదే విషయమై స్థానిక ఏఎస్ఐ వెంకన్న,  ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ మాట్లాడుతూ గుగులోతు చంద్రకాంత్ ప్రమాదవశాత్తు మృతి చెందడం చాలా బాధాకరమని, వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటరెడ్డి, ఉపాధ్యాయులు ఎల్లారెడ్డి ఐకెపి ఉద్యోగులు సత్యనారాయణ, నరసయ్య, సమ్మయ్య, మల్సూర్ విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

Image 1

ప్రియుడు ను "కొత్త స్టైల్ ప్రపోజ్" పేరుతో కుర్చీకి కట్టేసి సజీవదహనం చేసిన ప్రియురాలు

Posted On 2026-04-22 12:20:38

Readmore >
Image 1

లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ప్రైవేటు డ్రైవర్లతో నడిపిస్తుండగా ప్రమాదం

Posted On 2026-04-22 10:42:24

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన మహిళ సీఐ మరియు ఎస్ఐ

Posted On 2026-04-22 07:35:51

Readmore >
Image 1

జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-04-21 19:56:02

Readmore >
Image 1

జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి

Posted On 2026-04-21 19:53:11

Readmore >
Image 1

సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్

Posted On 2026-04-21 18:31:56

Readmore >
Image 1

జిల్లాలో ఒకే రోజు 58 మందికి కోర్టు శిక్షలు

Posted On 2026-04-21 18:28:04

Readmore >
Image 1

హాస్టల్ విద్యార్థుల సమస్యలపై ఏబీవీపీ ఆందోళన

Posted On 2026-04-21 18:25:47

Readmore >
Image 1

బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలి : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-04-21 17:08:06

Readmore >
Image 1

ఐవిఎఫ్ మరియు కామారెడ్డి రక్తదాతల సమూహ సేవలు అభినందనీయం

Posted On 2026-04-21 17:02:20

Readmore >