Posted on 2024-09-19 14:16:01
మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసిన జిల్లా ఎస్పీ టి. శ్రీనివాస రావు
డైలీ భారత్, గద్వాల: జోగుళాంబ గద్వాల్ జిల్లా పరిదిలోని కేటీ దొడ్డి పోలీస్ స్టేషన్ నందు విధులు నిర్వర్తిస్తున్న మహిళ కానిస్టేబుల్ కుమారి శ్రావణి ( డబ్యు పి సి -230) బుధవారం నాగార్జున సాగర్ దగ్గర రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందడం పట్ల జిల్లా ఎస్పీ టి. శ్రీనివాస రావు, ఐపీఎస్ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
పోలీస్ స్టేషన్ లో ఎంతో బాధ్యత తో రిసెప్షన్ విధులు నిర్వహిస్తూ ప్రజలకు సేవలు అందిస్తున్న మహిళ కానిస్టేబుల్ అనుకోనివిధంగా రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందడం ఎంతో బాధ కలిగించిందని, జిల్లా పోలీసు వ్యవస్థకు మహిళ కానిస్టేబుల్ శ్రావణి లేని లోటు తీరనిదని, బాధిత కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని జిల్లా ఎస్పీ తెలియజేశారు. బాధిత కుటుంబానికి అన్ని వేళలా అండగా ఉంటూ పోలీసు వ్యవస్థ తరుపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు..
లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు విఫలం.. రాజకీయ దుమారం, ముందున్న మార్గాలపై చర్చ
Posted On 2026-04-18 17:19:19
Readmore >
సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా జంగంపల్లి గ్రామ సర్పంచ్ వాణి వాసు యాదవ్
Posted On 2026-04-18 17:08:15
Readmore >