| Daily భారత్
Logo




"గాంధీ" లో మరణాలపై రగడ..

News

Posted on 2024-09-19 11:55:29

Share: Share


"గాంధీ" లో మరణాలపై రగడ..

డైలీ భారత్, హైదరాబాద్: గాంధీ ఆస్పత్రిలో పసిపిల్లలు, బాలింతల మరణంపై అధికార, ప్రతిపక్షాల మధ్య బుధవారం మాటల యుద్ధం మొదలైంది. ప్రభుత్వాన్ని నిలదీస్తూ, ముఖ్యమంత్రిపై తీవ్ర విమర్శలు చేస్తూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చేసిన ట్వీట్‌కు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కూడా ఎక్స్‌లో ఘాటుగా బదులిచ్చారు

ప్రభుత్వ దవాఖాన్లపై కుట్రలు వద్దంటూ మంత్రి దామోదర రాజనర్సింహ ఫైర్‌

 ఈ ఏడాదిలో 48 మంది పసిబిడ్డలు, 14 మంది బాలింత తల్లులు మరణించారని ఎంతో మందికి ప్రాణం పోసిన గాంధీ ఆస్పత్రిలో ఇంత విషాదమా? ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? వ్యవస్థలు పనిచేస్తున్నాయా? పసిబిడ్డల ప్రాణాలకు విలువ లేదా? అని కేటీఆర్‌ "ఎక్స్‌" లో ప్రశ్నించారు. ఒక్క గాంధీలోనే ఇన్ని మరణాలుంటే.. రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితేంటని, సీఎం ఏం చేస్తున్నారని నిలదీశారు. పాలన గాలికి వదిలేసి విగ్రహ రాజకీయాలు చేస్తున్న సీఎంకు ఎవరైనా బాధ్యతను గుర్తు చేయాలని కోరారు.

కేటీఆర్‌ చేసిన ఈ వ్యాఖ్యలపై మంత్రి దామోదర రాజనర్సింహ తీవ్రంగా స్పందించారు. గాంధీ ఆస్పత్రిపై బురద జల్లి రోగులు రాకుండా చేసి కార్పొరేట్‌ ఆస్పత్రులకు లబ్ధి చేకూర్చాలని కేటీఆర్‌ కుట్ర పన్నుతున్నారని ఆరోపిస్తూ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. గాంధీ వంటి టెర్షియరీ కేర్‌ ఆస్పత్రులకు అత్యంత విషమ పరిస్థితుల్లో ఉన్న రోగులే వస్తారని, వారిని కాపాడేందుకు చివరి నిమిషం వరకు వైద్యులు ప్రయత్నిస్తారని వివరించారు. పరిస్థితి విషమంగా ఉండడం వల్ల కొందరు రోగులు ప్రాణాలు కోల్పోతారని తెలిపారు. దేశంలోని ఏ టెర్షియరీ కేర్‌ ఆస్పత్రిలోనైనా ఇలాంటి ఘటనలు ఉంటాయన్నారు. కానీ, కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాకే ఇలా జరిగిందంటూ కేటీఆర్‌ మరణాల సంఖ్యను భూతద్దంలో చూపిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ హయాంలో గాంధీ ఆస్పత్రిలో చోటుచేసుకున్న మరణాల వివరాలను విడుదల చేశారు. కాగా, సినీనటుడు నాగార్జునను సీఎం రేవంత్‌రెడ్డి రూ.400కోట్లు డిమాండ్‌ చేశారని బాల్క సుమన్‌ ఆరోపించారు. ఆ మొత్తం ఇవ్వనందుకే ఎన్‌కన్వెన్షన్‌ కూల్చేశారని విమర్శించారు.

Image 1

స్కూల్ పరిసరాల్లో సిగరెట్, గుట్కా నిషేధం

Posted On 2026-04-19 22:26:42

Readmore >
Image 1

పీసా అమలు ఎక్కడ.?

Posted On 2026-04-19 22:25:03

Readmore >
Image 1

శ్రీ ఇందు ఇంజనీరింగ్ కళాశాలలో దారుణం.... హల్ టికెట్ ఇవ్వకపోవడంతో విద్యార్థి ఆత్మహత్య

Posted On 2026-04-19 22:22:58

Readmore >
Image 1

ఆధార్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. 5 నెలలు ఫ్రీ

Posted On 2026-04-19 22:21:17

Readmore >
Image 1

మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న తంబళ్ల రవి

Posted On 2026-04-19 14:12:55

Readmore >
Image 1

ఎంఎంటీఎస్‌లో అందరికీ ఉచిత ప్రయాణం?

Posted On 2026-04-19 10:18:18

Readmore >
Image 1

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి శస్త్ర చికిత్సా

Posted On 2026-04-18 22:48:35

Readmore >
Image 1

లవ్ జీహాద్ ని భారత దేశం నుండి తరిమి కొట్టాలి

Posted On 2026-04-18 22:34:02

Readmore >
Image 1

2029పై బీజేపీ దృష్టి..?

Posted On 2026-04-18 17:30:19

Readmore >
Image 1

రోడ్ సేఫ్టీ పోటీల విజేతలకు జిల్లా కలెక్టర్ ప్రశంసలు

Posted On 2026-04-18 17:23:21

Readmore >