| Daily భారత్
Logo




లెబనాన్ లో వాకి టాకీలు పేలి 20 మంది దుర్మరణం ... 450 మందికి తీవ్ర గాయాలు

News

Posted on 2024-09-19 11:49:12

Share: Share


లెబనాన్ లో వాకి టాకీలు పేలి 20 మంది దుర్మరణం ... 450 మందికి తీవ్ర గాయాలు

డైలీ భారత్,  లెబనాన్‌: లేబనాన్ లో మంగళవారం పేజర్ల సంఘటన మరువ కముందే ఈరోజు ఉదయం లెబనాన్‌లో వైర్‌లెస్ కమ్యూనికేషన్ పరికరాలు మరోసారి పేలడంతో 20 మంది చనిపోయారని, 450 మంది గాయపడ్డారని ఆ దేశ ఆరోగ్య మంత్రి వెల్లడించారు.

హిజ్బుల్లాకు బాగా పట్టున్న ప్రాంతాలుగా పరిగణించే బీకా వ్యాలీ, దక్షిణ లెబ నాన్, బీరూట్‌కు దక్షిణ శివారు ప్రాంతాల్లో హిజ్బుల్లా గ్రూప్ సభ్యులు ఉపయోగించిన వాకీ టాకీలు పేలాయి.

మంగళవారం హిజ్బుల్లా గ్రూప్ సభ్యులు ఉపయో గించే పేజర్లు పేలడంతో 12 మంది చనిపోయారు. వీరిలో కొంతమంది అంత్య క్రియలు జరుగుతుండగా కొన్ని వాకీటాకీలు పేలా యని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 

ఈ దాడులు ఇజ్రాయెల్ చేసిందని హిజ్బుల్లా ఆరోపించింది. ఇజ్రాయెల్ దీనిపై స్పందించలేదు. యుద్ధం మరో అంకానికి చేరిందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గల్లంట్ ప్రకటించిన తరుణంలోనే హిజ్బుల్లాపై ఈ దాడులు జరిగాయి.

అలాగే లెబనాన్ సరిహద్దుల్లో ఇజ్రాయెల్ ఆర్మీని మోహరించింది.ఈ పరికరాలన్నింటినీ పేల్చేయ డం అనేది ఒక పెద్ద మిలి టరీ ఆపరేషన్‌కు ముందు చేసే సన్నాహక దాడుల్లా కనిపిస్తున్నాయని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటె రస్ అన్నారు. అందరూ శాంతిని పాటించాలని ఆయన సూచించారు.

ఉత్తర ప్రాంతంలో నిరాశ్రయులుగా మారిన వేల మంది ప్రజలను సురక్షితంగా ఇళ్లకు చేర్చుతామని పేలుళ్లు జరిగిన కొన్ని గంటల తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హామీ ఇచ్చారు.యుద్ధంలో కొత్త అంకాన్ని మొదలు పెట్టామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గల్లంట్ చెప్పారు. 

వనరులు, బలగాలను తరలిస్తూ తమ దృష్టి ప్రధానంగా ఉత్తరం వైపే కేంద్రీకరించామని వెల్లడించారు.గాజాలో క్రియాశీలంగా వ్యవహరిం చిన ఒక ఆర్మీ బృందాన్ని మళ్లీ ఉత్తరాన మోహరించి నట్లు ఇజ్రాయెల్ మిలటరీ ధ్రువీకరించింది.

Image 1

స్కూల్ పరిసరాల్లో సిగరెట్, గుట్కా నిషేధం

Posted On 2026-04-19 22:26:42

Readmore >
Image 1

పీసా అమలు ఎక్కడ.?

Posted On 2026-04-19 22:25:03

Readmore >
Image 1

శ్రీ ఇందు ఇంజనీరింగ్ కళాశాలలో దారుణం.... హల్ టికెట్ ఇవ్వకపోవడంతో విద్యార్థి ఆత్మహత్య

Posted On 2026-04-19 22:22:58

Readmore >
Image 1

ఆధార్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. 5 నెలలు ఫ్రీ

Posted On 2026-04-19 22:21:17

Readmore >
Image 1

మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న తంబళ్ల రవి

Posted On 2026-04-19 14:12:55

Readmore >
Image 1

ఎంఎంటీఎస్‌లో అందరికీ ఉచిత ప్రయాణం?

Posted On 2026-04-19 10:18:18

Readmore >
Image 1

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి శస్త్ర చికిత్సా

Posted On 2026-04-18 22:48:35

Readmore >
Image 1

లవ్ జీహాద్ ని భారత దేశం నుండి తరిమి కొట్టాలి

Posted On 2026-04-18 22:34:02

Readmore >
Image 1

2029పై బీజేపీ దృష్టి..?

Posted On 2026-04-18 17:30:19

Readmore >
Image 1

రోడ్ సేఫ్టీ పోటీల విజేతలకు జిల్లా కలెక్టర్ ప్రశంసలు

Posted On 2026-04-18 17:23:21

Readmore >