Posted on 2024-09-16 08:12:13
డైలీ భారత్, తెలంగాణ: వినాయక నిమజ్జనం సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి వైరా నియోజకవర్గ నాయకులు లకావత్ గిరిబాబు సూచిస్తున్నారు. ముఖ్యంగా నిమజ్జనానికి వెళ్లేవారు చెరువు లోపలికి వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు. పోలీసుల సూచనలు పాటించాలని స్పష్టం చేస్తున్నారు. చెరువులల్లో అధికారులు సూచించిన చోట మాత్రమే నిమజ్జనం చేయాలని స్పష్టం చేస్తున్నారు. ఊరెగింపు సమయంలో విగ్రహం వెల్లే దారిలో విద్యుత్ తీగలు తగలకుండా సంబంధిత శాఖల సమన్వయంతో చూసుకోవాలన్నారు. చిన్న పిల్లలు నిమజ్జనం సమయంలో జాగ్రత్తలు పాటించాలని తల్లిదండ్రులు, పెద్దల పర్యవేక్షణలో ఉండేలా చూసుకోవాలని అన్నారు. పారిశుద్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి సూచించారు. ఎప్పటికప్పుడు పారిశుధ్యం మెరుగు పరచాలని సిబ్బందినీ ఆదేశించారు.
చెందిప్పలో దొంగల బీభత్సం....అడ్డుకున్న వృద్ధురాలిపై కిరాతక దాడి
Posted On 2026-09-11 03:39:31
Readmore >
నిజాంసాగర్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-09-10 15:22:16
Readmore >
వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలను అరెస్టు చేసిన జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్
Posted On 2026-09-10 07:02:32
Readmore >
కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్
Posted On 2026-09-09 14:45:53
Readmore >