| Daily భారత్
Logo




ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి, వైద్య కళాశాల ప్రారంభోత్సవాలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి

News

Posted on 2024-09-14 16:16:32

Share: Share


ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి, వైద్య కళాశాల ప్రారంభోత్సవాలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి

జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

క్షేత్రస్థాయిలో పరిశీలించి పటిష్ఠ ఏర్పాట్లకు ఆధికారులకు తగు ఆదేశాలు జారీ.

డైలీ భారత్, వరంగల్: ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి, వైద్య కళాశాలల  ప్రారంభోత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిలు ఆదేశించారు.

శనివారం వరంగల్ జిల్లా నర్సంపేటలోని పాకాల రోడ్డు లో నూతనంగా నిర్మించిన  నూతనంగా నిర్మించిన జిల్లా ఆస్పత్రి, వైద్య కళాశాలలను వారు క్షేత్రస్థాయిలో పరిశీలించి సమర్ధ నిర్వహణకు ఆధికారులకు పలు సూచనలు చేశారు. 

ఈ సందర్భంగా శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ... 

నర్సంపేట పట్టణంలో నూతనంగా నిర్మించిన జిల్లా ఆస్పత్రి, వైద్య కళాశాలలను ఈనెల 17న ప్రారంభినచనున్నట్లు ఈ కార్యక్రమానికి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మాత్యులు దామోదర రాజనర్సింహ,  జిల్లా ఇన్చార్జ్ మంత్రి మరియు రెవిన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల  శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి,  రాష్ట్ర అటవీ పర్యావరణ దేవదాయ శాఖ మంత్రి  కొండ సురేఖ, రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి  శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, ప్రజాప్రతినిధులు ముఖ్య అతిధులుగా రానున్నారని తెలిపారు.

50 మంది వైద్య విద్యార్థులకు సరిపడే విధంగా ప్రొఫెసర్లను ఇతర సిబ్బంది నియమించడం జరిగిందని, జిల్లా ఆసుపత్రికి అనుగుణంగా పరికరాలు వైద్యులను నియమించడం దాదాపు పూర్తయిందని అన్నారు. రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నటువంటి ఎనిమిది నూతన కళాశాలలు వైద్యశాలలో నర్సంపేట ఆసుపత్రికి కళాశాలకు మాత్రమే అవకాశం వచ్చిందని  ఎమ్మెల్యే మాధవరెడ్డి అన్నారు.

 జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా మాట్లాడుతూ ప్రారంభోత్సవ ఏర్పాట్లకు నియమించిన అధికారులు  ఎలాంటి లోటుపాట్లు లేకుండా తమకు కేటాయించిన విధులను  అంకితభావంతో నిర్వర్తించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు.

ఆసుపత్రి  ప్రాంగణంలో ఏర్పాటు చేయబోయే ఇందిరా మహిళ శక్తి కాంటీన్ ను కలెక్టర్, ఎమ్మెల్యే లు పరిశీలించారు.

ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో కలెక్టర్, ఎమ్మెల్యే లు మొక్కలు నాటారు.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్ దాస్, ఆర్డీవో కృష్ణవేణి, డీసీపీ రవీందర్, డిఎమ్అండ్ హెచ్ఓ వెంకటరమణ, ఎన్పిడిసిఎల్  ఎస్ఈ మధుసూదనరావు, జిల్లా బిసి సంక్షేమ శాఖ అధికారి పుష్పలత, జెడ్పీ సీఈఓ రామిరెడ్డి, జిల్లా అధికారులు, డాక్టర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు,  పోలీసు,  ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Image 1

నిజాంసాగర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Posted On 2026-09-10 15:22:16

Readmore >
Image 1

కామారెడ్డిలో రైస్ మిల్లర్ల మహా ధర్నా విజయవంతం...

Posted On 2026-09-10 15:19:28

Readmore >
Image 1

CMRF ద్వారా లక్ష్మణ్‌కు రూ.19,000 ఆర్థిక సహాయం

Posted On 2026-09-10 09:43:29

Readmore >
Image 1

ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి బలవన్మరణం

Posted On 2026-09-10 07:03:46

Readmore >
Image 1

వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలను అరెస్టు చేసిన జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్

Posted On 2026-09-10 07:02:32

Readmore >
Image 1

వాటర్ బాటిలు అధిక ధర.. రూ.7 లక్షలు ఫైన్!

Posted On 2026-09-09 17:17:04

Readmore >
Image 1

కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్

Posted On 2026-09-09 14:45:53

Readmore >
Image 1

స్పీకర్ కు బీఆర్ఎస్ బహిరంగ క్షమాపణ చెప్పాలి

Posted On 2026-09-09 14:29:32

Readmore >
Image 1

దేమేకలాన్ పాఠశాలలో ఘనంగా కలోజి నారాయణరావు జయంతి వేడుకలు

Posted On 2026-09-09 14:28:15

Readmore >
Image 1

జర్నలిస్టుల సంక్షేమానికి కృషి

Posted On 2026-09-09 08:35:55

Readmore >