Posted on 2024-09-13 12:53:51
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: షాద్ నగర్ నియోజకవర్గంలో తిరుగులేని నేతగా తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అని కాంగ్రెస్ యువ నాయకులు అనిమి అఖిల్ గౌడ్,శ్రీనివాస్ యాదవ్, మహేష్ యాదవ్ అభినందించారు శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాలువాతో చైర్మన్ వీర్లపల్లి శంకర్ ను సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీలో కార్యకర్త స్థాయి నుండి మండల పార్టీ అధ్యక్షుడిగా సేవలు అందించాలని ఆ తరువాత నియోజకవర్గస్థాయిలో పార్టీకి సేవలు అందించినట్లు పేర్కొన్నారు. తన స్వయంకృషి పని విధానం మెచ్చి అధిష్టానం గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించిందని అన్నారు. నియోజకవర్గంలో తిరుగులేని నాయకుడిగా చలామణి అవుతున్న క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పై భరోసాతో రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థల చైర్మన్ గా నియమించడం ఎంతో అభినందనీయమని యువనేతలు అభినందించారు. ప్రభుత్వ పెద్దలకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు
దమ్మపేటలో ఘనంగా భారత రాష్ట్ర సమితి (BRS)పార్టీ అవిర్భావ దినోత్సవ వేడుకలు
Posted On 2026-04-27 14:12:14
Readmore >
పదేళ్లలో ప్రజలకు సుపరిపాలన అందించిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్
Posted On 2026-04-27 14:09:19
Readmore >
మొగలపల్లిలో సీనియర్ కమ్యూనిస్టు నాయకులు వెంకటరావుకు ఘన సన్మానం
Posted On 2026-04-27 10:36:06
Readmore >