Posted on 2023-11-09 06:34:58
డైలీ భారత్, జమ్మూ కాశ్మీర్: జమ్మూ కాశ్మీర్లో గురువారం ఉదయం లష్కరే తోయిబా ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.ఈ ఎన్కౌంటర్ లో లష్కరే తోయిబా ఉగ్రవాది హతం అయ్యాడు..
జమ్మూ కాశ్మీర్లోని షోపియాన్లోని కథోహలన్ ప్రాంతంలో లష్కరే తోయిబా (ఎల్ఇటి)కి చెందిన నిషేధిత సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టిఆర్ఎఫ్)కి అనుబంధంగా ఉన్న ఉగ్రవాదిని భద్రతా బలగాలు గురువారం మట్టుబెట్టాయి..
తెల్లవారుజామున ప్రారంభమైన ఈ ఎన్కౌంటర్ స్థానిక పోలీసులు, భారత సైన్యం సంయుక్తంగా చేపట్టింది. ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు ఇంకా గాలింపు కొనసాగిస్తున్నాయి. మరణించిన ఉగ్రవాదిని ఇంకా గుర్తించలేదు. ఎన్కౌంటర్ స్థలం నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు జమ్మూకశ్మీర్ పోలీసులు తెలిపారు. ఈ ఎదురుకాల్పుల ఘటనపై కాశ్మీర్ జోన్ పోలీసులు గురువారం ఎక్స్ లో పోస్టు చేశారు..
ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!
Posted On 2026-09-03 09:31:35
Readmore >
ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా
Posted On 2026-09-03 09:21:29
Readmore >
భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య
Posted On 2026-09-03 07:53:15
Readmore >
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >