Posted on 2024-09-09 22:52:21
చేయి చేసుకున్న వీఆర్వో జయలక్ష్మీ తీరుపై ప్రభుత్వం సీరియస్
వీఆర్వోను విధుల నుంచి తప్పించారు
డైలీ భారత్, విజయవాడ: విజయవాడ వరద బాధితులపై చేయి చేసుకున్న వీఆర్వో జయలక్ష్మీ తీరుపై నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సీరియస్ అయింది. వీఆర్వోను విధుల నుంచి తప్పించారు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన.
వీఆర్వో జయలక్ష్మీకి షోకాజ్ నోటీసిచ్చిన కలెక్టర్ సృజన….వీఆర్వోను విధుల నుంచి తప్పించారు.
బాధితులతో సంయమనంగా వ్యవహరించాలని ఇప్పటికే చంద్రబాబు సూచనలు చేయడం జరిగింది.
బాధల్లో ఉన్న బాధితులు ఓ మాట అన్నా.. ఓపిగ్గా సమాధానం చెప్పాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇచ్చారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు స్వయంగా ఆదేశిస్తున్నా మారడం లేదు కొందరి ఉద్యోగుల తీరు. ఇక తీరు మారని ఉద్యోగుల విషయంలో కఠినంగా వ్యవహరించనున్న నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం… వెంటనే చర్యలు తీసుకుంటోంది.
గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-05-02 23:56:32
Readmore >
మర్రిపల్లి ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలి : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-05-02 23:48:08
Readmore >