Posted on 2024-09-08 15:00:49
కేశంపేట మండలం దేవుని గుడి తండాలో తీజ్ వేడుకలు
హాజరైన పలువురు బీఆర్ఎస్ నాయకులు
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: బంజారా, లంబాడీ సంస్కృతి సాంప్రదాయానికి చాటి చెప్పే పండుగలలో అతి ముఖ్యమైనది తీజ్ పండుగ అని ఎంతో వైభవోపేతంగా గిరిజనులు జరుపుకునే పండుగ అన్ని వర్గాలకు ఆదర్శప్రాయమైనదని మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. నియోజకవర్గ పరిధిలోని కేశంపేట మండలం దేవుని గుడి తండాలో తీజ్ పండుగ కార్యక్రమానికి ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డితో పాటు సిసిఎస్ వైస్ చైర్మన్ అంజిరెడ్డి సీనియర్ నాయకులు లక్ష్మీనారాయణ కొత్తపేట మాజీ సర్పంచ్ నవీన్ ఇప్పలపల్లి మాజీ సర్పంచ్ ఆంజనేయులు ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు రాంబాబు నాయక్, భూపాల్ రెడ్డి భద్ర నాయక్ నోకియా నాయక్ హటియా నాయక్ రామస్వామి శ్రీరాములు శీను తదితరులు హాజరైన ఈ కార్యక్రమంలో తీజ్ వేడుకలను వీక్షించారు. ఈ సందర్భంగా పండగ విశిష్టతను ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి పేర్కొంటూ.. ఈ పండుగను పెళ్ళి కాని అమ్మాయిలు భక్తి శ్రద్ధలతో తొమ్మిది రోజులు అత్యంత వైభవంగా జరుపుకుంటారని పేర్కొన్నారు. వారి ఆచారం ప్రకారం గిరిజన యువతులకు మంచి వరుడు దొరికేందుకు ఈ పండుగలు ఎంతో దోహదపడతాయని ఆయన అన్నారు. ఈ పండుగ ముఖ్య ఉద్ధేశ్యం తరతరాల నుండి వస్తున్న బంజారా సంస్కృతి సాంప్రదాయాలను రక్షించడం ఆ రోజు తాండ నాయకుని ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తూ తాండ నాయక్ ఇతర తాండ పెద్దలను గౌరవించడం. తాండలో వర్షాలు బాగా కురిసి ప్రతి తాండ ప్రకృతి పచ్చదనంతో కళకళలాడుతూ ఎప్పుడు పచ్చగా హరిత భరితంగా ఉండడం, పెళ్ళి కాని అమ్మాయిలకు చక్కటి భర్త దొరకాలని అన్ని కోరికలు నెరవేరాలని అమ్మాయిలు కోరుకోవడం ఎంతో సాతిసిద్దంగా ఉంటాయని కొనియాడారు..
గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-05-02 23:56:32
Readmore >
మర్రిపల్లి ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలి : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-05-02 23:48:08
Readmore >