Posted on 2024-08-06 16:17:10
వైద్యం కోసం ఇక ఎవరి వెంట పైరవీలు అక్కర్లేదు
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల కోసం ప్రజలు ఎన్నో ఇబ్బందులు
షాద్ నగర్ ఎమ్మెల్యే "వీర్లపల్లి శంకర్
నందిగామ, కేశంపేట, కొత్తూరు మండలాల లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: వైద్యం కోసం ఎవరి వెంట పెరవీల కోసం తిరగనక్కర్లేదని గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ఇవ్వని వారికోసం సీఎం రిలీఫ్ ఫండ్ పేరిట చెక్కులు పంపిణీ చేసిందని చాలీచాలని డబ్బులతో ప్రజలు అగచాట్లు పడ్డారని ఇక ఆ దౌర్భాగ్యం అక్కర్లేదని ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయల వైద్యాన్ని అందిస్తారని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. మంగళవారం షాద్ నగర్ క్యాంపు కార్యాలయంలో నందిగామ, కేశంపేట, కొత్తూరు మండలాల లబ్ధిదారులకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చెక్కులు పంపిణీ చేశారు. నందిగామ మాజీ ఎంపీపీ ప్రియాంక శివశంకర్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు వీరేశం, హరినాథ్ రెడ్డి, జంగా నరసింహా యాదవ్ రైతుల సమక్షంలో ఆయా మండలాల లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించారు. ఇప్పటివరకు లబ్ధిదారులకు ఎన్ని పెండింగ్ చెక్కులు ఉన్నాయో వాటిని ప్రభుత్వం విడుదల చేస్తోందని దాదాపు 500 నుండి 600 మందికి పెండింగ్ చెక్కులు వస్తున్నాయని గత రెండు రోజులుగా వీటిని ప్రజలకు అందజేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం అరకొర వైద్యం కోసం డబ్బులు చెల్లించకుండా పూర్తిస్థాయిలో వైద్యం అందే విధంగా ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయల కార్డులు అందజేస్తున్నట్లు చెప్పారు..
లడక్ శిఖరాన్ని అది రోహించిన కామారెడ్డి విద్యార్థి విస్లావత్ బన్నీకి సన్మానం
Posted On 2026-06-29 18:52:51
Readmore >
శ్రీ తెలంగాణ ఖాదీ భండార్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-06-29 18:51:47
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్పై కామారెడ్డి జిల్లా పోలీసుల కఠిన చర్యలు
Posted On 2026-06-29 18:49:45
Readmore >
అజ్మీర ఈరీ నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-29 18:10:23
Readmore >
నూతన వధూవరులను ఆశీర్వదించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-29 18:09:16
Readmore >
ఏరువాక పౌర్ణమి సందర్భంగా నాగలి దున్ని విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-29 11:48:10
Readmore >