| Daily భారత్
Logo




ఆదివాసి కాంగ్రెస్ గిరిజన రంగారెడ్డి జిల్లా చైర్మన్ గా శ్రీను నాయక్

News

Posted on 2024-07-26 11:33:14

Share: Share


ఆదివాసి కాంగ్రెస్ గిరిజన రంగారెడ్డి జిల్లా చైర్మన్ గా శ్రీను నాయక్

శ్రీను నాయక్ ను సన్మానించిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: కాంగ్రెస్ పార్టీ ఆదివాసి గిరిజన  విభాగం రంగారెడ్ది జిల్లా చైర్మన్ గా షాద్ నగర్ అసెంబ్లీకి చెందిన శ్రీను నాయక్ నియమితులయ్యారు. శుక్రవారం షాద్ నగర్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ను శ్రీను నాయక్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సంధర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ శ్రీను నాయక్ ను శాలువాతో సన్మానించి అభినందించారు. నియోజకవర్గంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా గిరిజన ప్రజలకు సేవలు అందించాలని ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వారికి చేరువ చేయాలని ఎమ్మెల్యే శంకర్ సూచించారు. గిరిజనుల సంక్షేమం అభివృద్ది విషయంలొ ప్రభుత్వానికి వారి సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదించాలని సూచించారు. స్థానికంగా గిరిజనులను చైతన్యవంతులు చేయడంలో శ్రీను నాయక్ పాత్ర గొప్పదని ఎమ్మెల్యే అభినందించారు గత అసెంబ్లీ ఎన్నికల్లో గిరిజనులను ఏకతాటిపైకి తెచ్చినందుకు శ్రీను నాయక్ కు ఈ పదవి ఇవ్వడం ఎంతైనా సముచితమని ఎమ్మెల్యే కొనియాడారు. ఈ సందర్భంగా శీను నాయక్ మాట్లాడుతూ తనపై పెట్టిన గురుతరమైన బాధ్యతను బాధ్యతగా భావించి అందరికీ న్యాయం చేస్తానని పేర్కొన్నారు. గిరిజన జాతి అభివృద్ధి సంక్షేమానికి ప్రభుత్వం తరఫున రావాల్సిన సంక్షేమ ఫలాలను వారికి అందే విధంగా తోడ్పాటును అందిస్తానని తెలిపారు. తనకు రంగారెడ్డి జిల్లా చైర్మన్ గా అవకాశం కల్పించిన గిరిజన కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్, స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తదితరులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు..

Image 1

పోలీసు స్టేష‌న్ స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

Posted On 2026-07-08 19:27:58

Readmore >
Image 1

మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం

Posted On 2026-07-08 14:21:40

Readmore >
Image 1

సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు

Posted On 2026-07-08 14:18:42

Readmore >
Image 1

వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి

Posted On 2026-07-08 07:55:23

Readmore >
Image 1

ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త

Posted On 2026-07-08 07:13:19

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >
Image 1

ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్‌ ఎక్కించి భర్తను చంపేసిన భార్య

Posted On 2026-07-07 14:04:52

Readmore >
Image 1

ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ

Posted On 2026-07-07 14:03:47

Readmore >
Image 1

ప్రభుత్వ పాఠశాలలకే పిల్లలను పంపిద్దాం

Posted On 2026-07-07 08:21:25

Readmore >