Posted on 2026-07-08 07:13:19
కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త.
భార్యాభర్తల మధ్య గొడవ ప్రాణాలు తీసే వరకు వెళ్లింది. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న భార్యను కత్తితో గొంతుకోసి హతమార్చాడు.
డైలీ భారత్, కదిరి: సత్యసాయి జిల్లా కదిరిలోని ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఈ దారుణం చోటుచేసుకుంది. ముదిగుబ్బ మండలం ఈదులపల్లి గ్రామానికి చెందిన గంగరాజు అనే వ్యక్తి, తన భార్య సునీత (32)ను ఆసుపత్రి ఆవరణలోనే అత్యంత క్రూరంగా గొంతు కోసి హత్య చేశాడు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
భర్త దాడిలో గాయాలు.. కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దంపతుల మధ్య తలెత్తిన తీవ్రమైన గొడవ కారణంగా గంగరాజు తన భార్యపై దాడిచేశాడు. భర్త దాడిలో గాయపడిన సునీతకు చికిత్స అందించేందుకు ఆమెను కుటుంబ సభ్యులు కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలోని మహిళా వార్డులో ఆమె చికిత్స పొందుతోంది. అయితే నిందితుడు గంగరాజు అక్కడికి చేరుకుని, మెరుగైన వైద్యం కోసం వేరే ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్దామని కుటుంబసభ్యులను నమ్మించాడు. హాస్పిటల్ వార్డు నుంచి భార్య సునీతను బయటకు తీసుకువచ్చాడు.
కత్తితో గొంతు కోసి భర్త దారుణం
ప్రైవేట్ హాస్పిటల్కు వెళ్లేందుకు కదిరి ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలోకి రాగానే, ప్లాన్ ప్రకారం తన వెంట తెచ్చుకున్న కత్తితో గంగరాజు భార్య సునీత గొంతు కోశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ దారుణంపై సమాచారం అందుకున్న కదిరి పట్టణ సీఐ నారాయణరెడ్డి తమ సిబ్బందితో కలిసి వెంటనే ఆసుపత్రికి చేరుకుని పరిశీలించారు. అప్పటికే కుటుంబసభ్యులు, మరికొందరు వ్యక్తులు పట్టుకున్న నిందితుడు గంగరాజును అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసిన కదిరి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు, తప్పిదాలు జీవితాలను తలకిందులు చేస్తాయని.. కుటుంబాలు రోడ్డున పడతాయని పోలీసులు ప్రజలను హెచ్చరించారు
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 16:09:21
Readmore >