Posted on 2024-07-20 16:52:36
కొందుర్గు మండలంలో రైతు రుణమాఫీ సంబరాలు
సంబరాలకు హాజరైన మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి శ్యాంసుందర్ రెడ్డి తదితరులు
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: ఇచ్చిన మాట ప్రకారం ప్రతిపక్షాలు అనే విధంగా అనుకున్న సమయంలో కన్నా ముందే రైతులు రుణమాఫీ ప్రక్రియ ప్రారంభించడం ఎంతో సంతోషకరమని తెలంగాణ రాష్ట్ర రైతాంగం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎల్లవేళలా రుణపడి ఉంటారని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి శ్యాంసుందర్ రెడ్డి తదితరులు అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కొందుర్గు మండలంలో రైతు రుణమాఫీ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తో పాటు మండల పార్టీ అధ్యక్షులు కృష్ణారెడ్డి మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సయ్యద్ సాదిక్, మాజీ ఎంపిపి శివ శంకర్ గౌడ్, మైనార్టీ యువ నాయకుడు అక్రమ్, సింగిల్ విండో చైర్మన్ దామోదర్ రెడ్డి తదితర మాజీ ఎంపీటీసీలు సర్పంచులు పార్టీ శ్రేణులు తదితరులు భారీ ఎత్తున హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే శంకర్ చిత్రపటాలకు రైతులు పాలాభిషేకం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 4 కోట్ల ప్రజల కోసం సోనియాగాంధీ ఆరు గ్యారెంటీలను ప్రకటించడం జరిగిందని, ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ సభలో రాహుల్ గాంధీ 2 లక్షల రుణ మాఫీ చేస్తామని చెప్పినట్లుగానే నేడు రుణ మాఫీ చేశారన్నారు. రైతు బాంధవుడు, రైతు సమస్యలు ఎరిగిన వాడు.. రైతు కష్టాలను దగ్గరుండి చూసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రైతులకు సంబందించిన పంట రుణాలను అది కూడా ఏకకాలంలో రూ.2లక్షల రుణ మాఫీ చేసి రైతు బాంధవుడిగా మారిన నాయకుడు రేవంత్ రెడ్డి ఒక్కరేనన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే కొన్నీ గ్యారెంటీలను అమలు చేశామని అన్నారు. ప్రతి రైతు కళ్లల్లో ఆనందం చూడాలన్నదే కాంగ్రెస్ లక్ష్యమన్నారు. ముందుగా రూ.లక్ష వరకు రుణ మాపీ చేయడం జరిగిందని, ఈ నెలాఖరు వరకు 1.5 లక్షలు, ఆగస్టు 15 నాటికి మొత్తం 2 లక్షల రుణ మాఫీ చేయడం జరుగుతుందన్నారు. రుణ మాఫీ చేసిన సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, సీఎం రేవవంత్ రెడ్డిలకు రాష్ట్ర ప్రజలంతా రుణ పడి ఉంటారని అన్నారు..
ప్రతి ఇంటి సమాచారం నమోదు… మన అందరి ప్రథమ కర్తవ్యం... జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా
Posted On 2026-04-24 22:25:39
Readmore >
బూర్గంపాడు మండలం : పేకాట స్థావరాలపై సిసిఎస్ పోలీసులు మెరుపు దాడి
Posted On 2026-04-24 22:18:33
Readmore >
ద్విచక్ర వాహనం చోరి నిందితులను చాకచక్యంగా పట్టుకున్న జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి, సిబ్బంది
Posted On 2026-04-24 19:11:00
Readmore >