Posted on 2024-07-20 13:22:36
కొందుర్గు మండలంలో రైతు రుణమాఫీ సంబరాలు
సంబరాలకు హాజరైన మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి శ్యాంసుందర్ రెడ్డి తదితరులు
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: ఇచ్చిన మాట ప్రకారం ప్రతిపక్షాలు అనే విధంగా అనుకున్న సమయంలో కన్నా ముందే రైతులు రుణమాఫీ ప్రక్రియ ప్రారంభించడం ఎంతో సంతోషకరమని తెలంగాణ రాష్ట్ర రైతాంగం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎల్లవేళలా రుణపడి ఉంటారని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి శ్యాంసుందర్ రెడ్డి తదితరులు అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కొందుర్గు మండలంలో రైతు రుణమాఫీ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తో పాటు మండల పార్టీ అధ్యక్షులు కృష్ణారెడ్డి మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సయ్యద్ సాదిక్, మాజీ ఎంపిపి శివ శంకర్ గౌడ్, మైనార్టీ యువ నాయకుడు అక్రమ్, సింగిల్ విండో చైర్మన్ దామోదర్ రెడ్డి తదితర మాజీ ఎంపీటీసీలు సర్పంచులు పార్టీ శ్రేణులు తదితరులు భారీ ఎత్తున హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే శంకర్ చిత్రపటాలకు రైతులు పాలాభిషేకం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 4 కోట్ల ప్రజల కోసం సోనియాగాంధీ ఆరు గ్యారెంటీలను ప్రకటించడం జరిగిందని, ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ సభలో రాహుల్ గాంధీ 2 లక్షల రుణ మాఫీ చేస్తామని చెప్పినట్లుగానే నేడు రుణ మాఫీ చేశారన్నారు. రైతు బాంధవుడు, రైతు సమస్యలు ఎరిగిన వాడు.. రైతు కష్టాలను దగ్గరుండి చూసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రైతులకు సంబందించిన పంట రుణాలను అది కూడా ఏకకాలంలో రూ.2లక్షల రుణ మాఫీ చేసి రైతు బాంధవుడిగా మారిన నాయకుడు రేవంత్ రెడ్డి ఒక్కరేనన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే కొన్నీ గ్యారెంటీలను అమలు చేశామని అన్నారు. ప్రతి రైతు కళ్లల్లో ఆనందం చూడాలన్నదే కాంగ్రెస్ లక్ష్యమన్నారు. ముందుగా రూ.లక్ష వరకు రుణ మాపీ చేయడం జరిగిందని, ఈ నెలాఖరు వరకు 1.5 లక్షలు, ఆగస్టు 15 నాటికి మొత్తం 2 లక్షల రుణ మాఫీ చేయడం జరుగుతుందన్నారు. రుణ మాఫీ చేసిన సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, సీఎం రేవవంత్ రెడ్డిలకు రాష్ట్ర ప్రజలంతా రుణ పడి ఉంటారని అన్నారు..
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్బ్యాగ్లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >
సెప్టెంబర్ 17 డెడ్ లైన్... ఉద్యమకారుల హామీలు నెరవేర్చకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం : JAC చైర్మన్ గజ్జెల దేవరాజు హెచ్చరిక
Posted On 2026-09-01 08:21:35
Readmore >