| Daily భారత్
Logo




కరెంటు బిల్లు చెల్లించమన్నందుకు విద్యుత్​ సిబ్బందిపై దాడి

News

Posted on 2024-07-19 12:53:51

Share: Share


కరెంటు బిల్లు చెల్లించమన్నందుకు విద్యుత్​ సిబ్బందిపై దాడి

డైలీ భారత్, హైదరాబాద్: కరెంటు బిల్లు చెల్లించమన్నందుకు విద్యుత్​ సిబ్బందిపై ఒక వ్యక్తి దాడి చేసి తీవ్రంగా గాయపర్చిన సంఘటన సనత్​నగర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో జరిగింది. తీవ్రంగా గాయపడిన కరెంటు సిబ్బందిని తోటి సిబ్బంది స్థానికులు కలిసి ఈఎస్​ఐసీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం విద్యుత్​ ఉద్యోగ సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ తర్వాత సనత్​ నగర్​ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విద్యుత్​ సంఘ నాయకులు తెలిపిన వివరాలు ప్రకారం, ఎర్రగడ్డ ప్రాంతంలో విద్యుత్​ లైన్​ ఇన్​స్పెక్టర్​గా పనిచేస్తున్న  శ్రీకాంత్​, మీటర్​ రీడర్​ సాయి ఉదయం మోతీనగర్​ మీటర్​ రీడింగ్​కు వెళ్లారు. మోతీనగర్​లోని రాముల పేరిట ఉన్న ఇంటి వద్దకు వెళ్లి కరెంటు బిల్లు బకాయి రూ.9,858 చెల్లించాల్సి ఉందని చెప్పారు. ఇంటి యజమాని కుమారుడు వచ్చి బిల్లు చెల్లించమని ఏం చేసుకుంటారో చేసుకొండని దురుసుగా ప్రవర్తించాడు. దీంతో విద్యుత్​ సిబ్బంది ఎంసీబీ ఆఫ్​ చేసి విద్యుత్​ సరఫరాను నిలిపివేశారు. విద్యుత్​ నిలిపివేయడంతో పట్టలేని కోపంతో ఆ యువకుడు మీటర్​ రీడర్​ సాయి గణేశ్​ను పిడి గుద్దులతో తీవ్రంగా కొట్టి, మీదపడి తన్నాడు. అడ్డుకోబోయిన శ్రీకాంత్​ పై దాడి చేశారు. ఈ సంఘటనలో సాయి గణేశ్​ కుడి కన్ను, ఇతర శరీర భాగాలపై తీవ్ర గాయాలు అయ్యాయి. ఆ యువకుడిని స్థానికులు అడ్డుకోవడంతో అక్కడి నుంచి శ్రీకాంత్​ అతనిని వెంటనే ఈఎస్​ఐసీ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. వైద్యుల పర్యవేక్షణలో అతడు చికిత్స పొందుతున్నాడు. వెంటనే బాధితులు సనత్​నగర్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సనత్​నగర్​ పోలీసులు బీఎన్​ఎస్​ చట్టం ప్రకారం 142, 115 క్లాజ్​-2 కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

విద్యుత్​ ఉద్యోగ సంఘం తీవ్ర ఆగ్రహం : మీటర్​ రీడర్​, లైన్​ ఇన్​స్పెక్టర్​పై జరిగిన దాడిని విద్యుత్​ ఉద్యోగ సంఘం తీవ్రంగా ఖండించింది. మీటర్​ రీడర్లపై ఇటీవల దాడులు పెరుగుతున్నాయని అన్నారు. దీంతో తాము ఉద్యోగం చేయాలా వద్దా అనే సంశయం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సంఘటనపై యూనియన్​ ప్రతినిధులతో చర్చించి కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. ఈ సంఘటనను సీఎండీ, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామని చెప్పారు. మీటర్​ రీడర్​పై దాడి చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేశారు.

Image 1

రాజన్న ఆలయ గోశాలకు వరిగడ్డి వితరణ

Posted On 2026-04-25 22:35:25

Readmore >
Image 1

పెట్రోల్, డీజిల్ నిల్వలపై ఆందోళన వద్దు : కలెక్టర్ కృతిక శుక్ల

Posted On 2026-04-25 22:28:14

Readmore >
Image 1

కానిస్టేబుల్‌ భార్య, అతడి కుమారుడ్ని కత్తితో పొడిచి చంపిన ప్రియురాలు

Posted On 2026-04-25 21:27:36

Readmore >
Image 1

ఆర్థిక మోసం కేసులో మంగ్లీ పాత్రపై దర్యాప్తు ముమ్మరం

Posted On 2026-04-25 20:38:22

Readmore >
Image 1

మంజుల కలం – ఆకలిపై అక్షర యజ్ఞం

Posted On 2026-04-25 19:28:22

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : బాల్య వివాహం... అడ్డుకున్న అధికారులు..

Posted On 2026-04-25 17:10:44

Readmore >
Image 1

కవిత "పాంచజన్యం" హామీలు

Posted On 2026-04-25 13:59:56

Readmore >
Image 1

కేసీఆర్ పై కవిత సంచలన వ్యాఖ్యలు

Posted On 2026-04-25 11:37:20

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర సేన ( టిఆర్ఎస్ )

Posted On 2026-04-25 11:28:47

Readmore >
Image 1

కలెక్టరేట్ లో కీచకుడు

Posted On 2026-04-25 10:11:42

Readmore >