Posted on 2024-07-15 19:17:22
భక్తిశ్రద్ధలతో పూజలు.....
కదిలాయి జగన్నాథ రథచక్రాలు
డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా: సాంస్కృతిక సమగ్రతకు మారుపేరు పూరి జగన్నాథ వేడుకలని మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. ఆర్టీసీ కాలనీలో కొలువైన శ్రీ పూరి జగన్నాథ స్వామి వేడుకలలో భాగంగా సోమవారం పట్టణంలో భారీ రథయాత్రను నిర్వాహకులు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డితో పాటు స్థానిక మున్సిపల్ చైర్మన్ కే నరేందర్ స్థానిక టిఆర్ఎస్ నాయకులు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ఏడాదికొకసారి గుడి నుంచి బయటకు వచ్చి రథయాత్రలో భక్తులకు స్వామి కనువిందు చేస్తారన్నారు. మూలవిరాట్ విగ్రహాలే రథయాత్రలో పాల్గొనడం వలన జగన్నాథ రథయాత్రను భక్తులు అత్యంత అపురూపంగా భావిస్తారని అన్నారు. జగన్నాథుడి రథాన్ని ‘నందిఘోష’ అని, బలభద్రుడి రథాన్ని ‘తాళధ్వజం’ అని, సుభద్రాదేవి రథం ‘పద్మధ్వజం’ అని భక్తులు పిలుస్తారన్నారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు స్వామివార్లను ఆభరణాలతో అలంకరిస్తారని, ద్వాదశి నాడు విగ్రహాలను మళ్లీ గర్భగుడిలోని సింహాసనంపై అలంకరించడం వల్ల యాత్ర పూర్తవుతుందని పేర్కొన్నారు. పూరి జగన్నాథుడి వేడుకలు దేశవ్యాప్తంగా ఎంతో విశేషాత్మకంగా ఆకట్టుకుంటాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. నియోజకవర్గంలో పూరి జగన్నాథుడి వేడుకలు రథయాత్ర జరపడం ఎంతో ఆనందంగా ఉందని నవీన్ కుమార్ రెడ్డి అన్నారు..
తెలంగాణ రాష్ట్రంలోని పోలీసు సిబ్బందికి "పుట్టినరోజు", "వివాహ వార్షికోత్సవం రోజు" లలో సెలవులు : డిజిపి బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-27 22:00:34
Readmore >
కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య చేత భర్త హత్య – నిందితురాలు అరెస్ట్
Posted On 2026-04-27 21:45:44
Readmore >
జిల్లా పరిషత్ హైస్కూల్లో ఉపాధ్యాయుల కొరతపై ఇన్చార్జి డిఈఓ వినతి
Posted On 2026-04-27 19:27:31
Readmore >
ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశంలో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్
Posted On 2026-04-27 19:01:31
Readmore >
డ్రగ్స్ నిర్మూలన, విద్యార్థుల భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన జిల్లా షీ టీం బృందం
Posted On 2026-04-27 18:56:03
Readmore >
తెలుగు రాష్ట్రాల ప్రజలు విలవిల... తెలంగాణలో భానుడు భగ్గుమంటున్నాడు
Posted On 2026-04-27 18:50:27
Readmore >