| Daily భారత్
Logo




జగన్నాథ్ రథయాత్ర వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి

News

Posted on 2024-07-15 15:47:22

Share: Share


జగన్నాథ్ రథయాత్ర వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి

భక్తిశ్రద్ధలతో  పూజలు.....

కదిలాయి జగన్నాథ రథచక్రాలు

డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా: సాంస్కృతిక సమగ్రతకు మారుపేరు పూరి జగన్నాథ వేడుకలని మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. ఆర్టీసీ కాలనీలో కొలువైన శ్రీ పూరి జగన్నాథ స్వామి వేడుకలలో భాగంగా సోమవారం పట్టణంలో భారీ రథయాత్రను నిర్వాహకులు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డితో పాటు స్థానిక మున్సిపల్ చైర్మన్ కే నరేందర్ స్థానిక టిఆర్ఎస్ నాయకులు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ఏడాదికొకసారి గుడి నుంచి బయటకు వచ్చి రథయాత్రలో భక్తులకు స్వామి కనువిందు చేస్తారన్నారు. మూలవిరాట్ విగ్రహాలే రథయాత్రలో పాల్గొనడం వలన జగన్నాథ రథయాత్రను భక్తులు అత్యంత అపురూపంగా భావిస్తారని అన్నారు. జగన్నాథుడి రథాన్ని ‘నందిఘోష’ అని, బలభద్రుడి రథాన్ని ‘తాళధ్వజం’ అని, సుభద్రాదేవి రథం ‘పద్మధ్వజం’ అని భక్తులు పిలుస్తారన్నారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు స్వామివార్లను  ఆభరణాలతో అలంకరిస్తారని, ద్వాదశి నాడు విగ్రహాలను మళ్లీ గర్భగుడిలోని సింహాసనంపై అలంకరించడం వల్ల యాత్ర పూర్తవుతుందని పేర్కొన్నారు. పూరి జగన్నాథుడి వేడుకలు దేశవ్యాప్తంగా ఎంతో విశేషాత్మకంగా ఆకట్టుకుంటాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. నియోజకవర్గంలో పూరి జగన్నాథుడి వేడుకలు రథయాత్ర జరపడం ఎంతో ఆనందంగా ఉందని నవీన్ కుమార్ రెడ్డి అన్నారు..

Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >
Image 1

కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు

Posted On 2026-09-01 15:32:20

Readmore >
Image 1

సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు

Posted On 2026-09-01 11:18:42

Readmore >
Image 1

ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-09-01 09:34:38

Readmore >