Posted on 2026-04-27 15:26:03
డైలీ భారత్, సూర్యాపేట: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ నర్సింహ గారి ఆదేశాల మేరకు ఈరోజు జిల్లా షీ టీమ్ బృందం జిల్లా కేంద్రంలో గల ప్రతిభ జూనియర్ కళాశాల, లక్ష్మి పారామెడికల్ కాలేజ్, అంగని వాడి సెంటర్స్ నందు విద్యార్థులకు, పిల్లలకు, మహిళలకు వివిధ అంశాల పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా షీ టీం బృందం మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో సాంకేతికత అభివృద్ధి చెందిన గుర్తి కొత్త తరహాలో మోసాలు జరుగుతున్నాయని విద్యార్థులు వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా యువత మాదకద్రవ్యాల బారిన పడి బంగారు భవిష్యత్తును కోల్పోతున్నారని డ్రగ్స్ ను నిర్మూలించడంలో అందరూ భాగస్వామ్యం కావాలని సంబంధించిన సమాచారాన్ని డయల్ 100 కు లేదా పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని సూచించారు. బాల్య వివాహాలు, మహిళల భద్రత, మానవ అక్రమ రవాణా, మాదకద్రవ్యాల నిర్మూలన, సోషల్ మీడియా దుష్ప్రభావాలు మొదలగు అంశాల గురించి వివరించారు. మహిళలు విద్యార్థులు వేధింపులకు గురి అయినట్లయితే 100కు సమాచారం ఇవ్వాలని, పిల్లల పట్ల ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించిన హింసకు గురి చేసిన 1098 కి సమాచారం ఇవ్వాలని కోరారు. సైబర్ మోసాలకు గురైతే 1930 కు ఫిర్యాదు చేయాలని సూచించారు.
"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం
Posted On 2026-07-14 13:21:15
Readmore >
ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్
Posted On 2026-07-14 12:02:32
Readmore >
సిరిసిల్ల : పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా భాష బోధించాలి... కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-07-14 11:17:33
Readmore >
పల్లెటూరి ప్రజలకు ముఖ్య సమాచారం.. పాము కాటుకు ఇక పై 108 లోను ఇంజక్షన్లు!
Posted On 2026-07-14 03:38:14
Readmore >
కల్లు తాగించి వృద్ధ మహిళల ఆభరణాలు అపహరించిన దొంగ అరెస్ట్, రిమాండ్
Posted On 2026-07-13 18:16:26
Readmore >