Posted on 2024-07-13 13:34:58
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ఒక కుటుంబానికి చెందిన అన్నా, చెల్లెలు మరో కుటుంబానికి చెందిన అన్నా, చెల్లెళ్లను ప్రేమించారు.. మూడు నెలల వ్యవధిలో ఒక కుటుంబానికి చెందిన అన్న చెల్లెలు ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు.
రాజన్న సిరిసిల్ల - వేములవాడ రూరల్ మండలం నూకలమర్రికి చెందిన పాలకుర్తి లింగయ్య, పద్మ దంపతులకు కొడుకు ప్రశాంత్(22), కూతురు నవ్య ఉన్నారు.
నవ్యకు ఆరు నెలల కింద ఓ యువకుడితో పెళ్లి అయ్యింది. అతడు పెళ్లి అనంతరం గల్ఫ్ దేశానికి వెళ్లిపోయాడు.. అప్పుడు నవ్య అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో ఐదేండ్ల నుంచి ప్రేమలో ఉన్న విషయం విషయం తల్లితండ్రులకు చెప్పి.. సదరు యువకుడితో పెండ్లి చేయాలని కోరింది. వారు ఒప్పుకోకపోవడంతో పురుగుల మందు తాగి మూడు నెలల క్రితం ఆత్మహత్య చేసుకుంది.
కాగా నవ్య ప్రేమించిన యువకుడి చెల్లెలు నవ్య సోదరుడైన ప్రశాంత్ కూడా ఐదేండ్లుగా ప్రేమించుకుంటున్నారు. దీని గురించి పెద్దలకు చెప్తే ఒప్పుకోలేదు.
దీంతో ప్రశాంత్ కూడా పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ నిన్న మృతిచెందాడు.
ఆస్తి కోసం కన్నవారిపై కక్ష... సొంత ఇంటికే నిప్పు పెట్టిన కుమార్తె!..
Posted On 2026-04-29 17:26:42
Readmore >
కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి
Posted On 2026-04-28 22:51:46
Readmore >
మత్తుకు బానిసలై జీవితాలను చిత్తు చేసుకోవద్దు : కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ
Posted On 2026-04-28 22:34:17
Readmore >