| Daily భారత్
Logo




రైతులకు నాణ్యమైన విద్యుత్తును అందిస్తాం : ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

News

Posted on 2024-07-10 15:25:04

Share: Share


రైతులకు నాణ్యమైన విద్యుత్తును అందిస్తాం : ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

సుమారు రెండు కోట్లతో పవర్ ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు

9 గ్రామాల రైతాంగానికి ప్రయోజనం

కొందుర్గు మండలం ఆగిర్యాల గ్రామంలో విద్యుత్ పనులను తనిఖీ చేసిన ఎమ్మెల్యే శంకర్

డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా: రైతులకు నాణ్యమైన విద్యుత్తును ప్రభుత్వం ద్వారా అందించడమే తమ లక్ష్యం అని, రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని వారి సమస్యల పరిష్కారానికి సత్వరమే తాను స్పందిస్తానని షాద్ నగర్ ఎమ్మెల్యే "వీర్లపల్లి శంకర్" అన్నారు. సుమారు రెండు కోట్ల రూపాయలతో మండలంలోని తొమ్మిది గ్రామాలలో వ్యవసాయానికి ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పవర్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసే ప్రక్రియను ఆయన బుధవారం పరిశీలించారు. ప్రొటెక్షన్ డిటి భాస్కర్ రావు తదితర అధికారులతో ఎమ్మెల్యే శంకర్ మాట్లాడారు. నాణ్యమైన విద్యుత్తు లభించే విధంగా 9 గ్రామాలకు నాణ్యమైన విద్యుత్ లభిస్తుందని పేర్కొన్నారు. మండలంలోని పాత ఆగిరాల, కొత్త ఆగిరాల, విశ్వనాథ్ పూర్, తంగేళ్లపల్లి, వెంకిర్యాల, తిరుమల దేవుని పల్లి, లక్ష్మీదేవి పల్లి, ఘటియతాండ, నాగార్జున హచరిస్ లకు నాణ్యమైన విద్యుత్ సౌకర్యం సమకూరుతుందని ఈ సందర్భంగా తెలిపారు. కోటి రూపాయల పైచిలుకు నిధులతో ఈ పనులు చేపట్టినట్టు చెప్పారు. ఇంకా మరో కోటి రూపాయల వరకు పనులు చేపట్టబోతున్నట్లు సూచనప్రాయంగా తెలిపారు. గత వేసవిలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులకు ఇకపై విద్యుత్ సమస్య తలెత్తకుండా రైతులు అడిగిన సమస్యకు 24 గంటల్లోనే విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు నిధులు మంజూరు చేసి పవర్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు. రైతుల అవసరాలకు అనుగుణంగా వెంటనే స్పందించినందుకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు మండల పార్టీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ కాంట్రాక్టర్ యెన్నం మధుసూదన్ రెడ్డి తదితరులు ఉన్నారు..

Image 1

పానిహాటిలో ఆర్‌.జి. కర్ బాధితురాలి తల్లి "విజయ" గర్జన!

Posted On 2026-05-04 20:24:36

Readmore >
Image 1

"యువతను మత్తు బారిన పడేస్తున్న డ్రగ్స్ – సమాజం అప్రమత్తం కావాలి"

Posted On 2026-05-04 20:16:49

Readmore >
Image 1

కామారెడ్డి ఎల్లారెడ్డి బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ కమిషనర్లు

Posted On 2026-05-04 20:10:55

Readmore >
Image 1

దమ్మపేట బిజెపి శ్రేణుల సంబరాలు

Posted On 2026-05-04 19:56:57

Readmore >
Image 1

సుజాతనగర్ : గంజాయి కేసులో పరారీలో ఉన్న మహారాష్ట్రకు చెందిన నిందితుడి అరెస్ట్

Posted On 2026-05-04 19:51:36

Readmore >
Image 1

కామారెడ్డి డిఎస్పిగా యస్. మధుసూదన్ బాధ్యతల స్వీకరణ

Posted On 2026-05-04 19:01:07

Readmore >
Image 1

హైవేపై కారు అగ్ని ప్రమాదం... సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు..

Posted On 2026-05-04 18:53:54

Readmore >
Image 1

హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు, 5000 రూపాయల జరిమానా

Posted On 2026-05-04 18:51:37

Readmore >
Image 1

అంతర్రాష్ట్ర వాహన దొంగల ముఠాను పట్టుకున్న సంగారెడ్డి జిల్లా పోలీసులు

Posted On 2026-05-04 18:49:53

Readmore >
Image 1

రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జూనియర్ అసిస్టెంట్

Posted On 2026-05-04 18:24:03

Readmore >