Posted on 2024-07-09 10:32:17
జిల్లా, మండల పారిశ్రామిక కేంద్రాల్లో జరిగే ధర్నాలను జయప్రదం చేయండి.
డైలీ భారత్, మాసాయిపేట మెదక్ ప్రతినిధి: మాసాయిపేట మండలం కేంద్రంలో మంగళవారం నాడు ఉదయం మెదక్ జిల్లా సిఐటియు జిల్లా కార్యదర్శి ఈ సందర్భంగా మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చింది. గత పదేళ్ళుగా సాగించిన సంస్కరణలు, ప్రైవేటీకరణ విధానాలను వేగవంతంగా అమలు చేసేందుకు మళ్ళీ ఉవ్విళ్ళూరుతున్నది. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే 4 లేబర్ కోడ్లను అమలు చేస్తామని బిజెపి ప్రభుత్వం ప్రకటించింది. బొగ్గు బ్లాకుల వేలానికి పూనుకున్నది. ఈపిఎఫ్ సకాలంలో చెల్లించని యాజమాన్యాలకు విధించే జరిమానాను భారీగా తగ్గించింది. కార్పొరేట్ - మతోన్మాదులను ప్రసన్నం చేసుకొని వారికి లాభాలు కట్టబెట్టేందుకు నిశ్చయంగా ఉంది. కేంద్ర బిజెపి విధానాలను నివారించి, కార్మిక హక్కులను కాపాడేందుకు దేశవ్యాప్తంగా కార్మిక పోరాటాలను ఉధృతం చేయాలని సిఐటియు అఖిల భారత కమిటీ నిర్ణయించింది. దేశవ్యాప్తంగా 2024 జూలై 10న “కార్మికుల కోర్కెల దినం" పాటించాలని పిలుపునిచ్చింది. అందులో భాగంగా మెదక్ జిల్లాలో జూలై 10న జిల్లా, మండల, పారిశ్రామిక కేంద్రాల్లో జరిగే ధర్నాల్లో కార్మికవర్గమంతా పాల్గొనాలని సిఐటియు రంగారెడ్డి జిల్లా కమిటీ విజ్ఞప్తి చేస్తుందని సిఐటియు జిల్లా కార్యదర్శి మల్లేశం తెలిపారు
ఈ సమావేశంలో పారిశుద్ధ్య కార్మికులు గుడ్డి నర్సింలు, నాగేష్, కిషన్, తదితరులు హాజరైనరు
రైస్ మిల్లుల్లో ధాన్యం వేగంగా అన్ లోడింగ్ చేయాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-04 21:45:49
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఘనంగా బిజెపి విజయోత్సవ సంబరాలు
Posted On 2026-05-04 21:41:50
Readmore >
"యువతను మత్తు బారిన పడేస్తున్న డ్రగ్స్ – సమాజం అప్రమత్తం కావాలి"
Posted On 2026-05-04 20:16:49
Readmore >
కామారెడ్డి ఎల్లారెడ్డి బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ కమిషనర్లు
Posted On 2026-05-04 20:10:55
Readmore >
సుజాతనగర్ : గంజాయి కేసులో పరారీలో ఉన్న మహారాష్ట్రకు చెందిన నిందితుడి అరెస్ట్
Posted On 2026-05-04 19:51:36
Readmore >
హైవేపై కారు అగ్ని ప్రమాదం... సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు..
Posted On 2026-05-04 18:53:54
Readmore >