Posted on 2024-07-02 23:11:47
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా:రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరాబాద్ లోని రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.
ఈ సమీక్ష సమావేశంలో రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో అత్యవసర మందులు అందుబాటులో ఉండేలా నిరంతర పర్యవేక్షణ ఉండాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు.
సీజనల్ వ్యాధులకు, పాము కాటు నివారణ కోసం అవసరమైన మందులు అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు.
వైద్య సదుపాయాలు కల్పనలో భాగంగా భౌగోళికంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు పీఏచ్ లు, సిఎ చ్ లు, ఏరియా హాస్పిటల్, జిల్లా ఆస్పత్రులు ఎంత దూరం లో ఉన్నాయో (హెల్త్ ఫెసిలిటీస్ మ్యాపింగ్) రూట్ మ్యాప్ ను సిద్ధం చేయాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ ఎంఎస్ఐడిసి అధికారులకు ఆదేశాలు జారీచేశారు.
ఈ సమీక్ష సమావేశంలో టి జి ఎం ఎస్ ఐ డి సి ఎండి హేమంత్ సహదేవరావు, రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ విశాలాక్షి, ఈడి కౌటిల్య, చీఫ్ ఇంజనీర్ దేవేందర్ కుమార్ లు పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా: ఆన్లైన్ బెట్టింగ్ లకు అలవాటు పడి మోసాలకు పాల్పడిన నిందితుల అరెస్ట్
Posted On 2026-03-13 19:19:09
Readmore >
సైబర్ కేటుగాళ్లను హడలెత్తిస్తున్న తెలంగాణ పోలీసులు.. 117 మంది అరెస్ట్!
Posted On 2026-03-13 17:33:46
Readmore >
కల్వకుంట్ల కవిత పుట్టిన రోజు సందర్భంగా పండ్లు, బ్రెడ్ పంపిణీ చేసిన జాగృతి శ్రేణులు
Posted On 2026-03-13 16:46:49
Readmore >
అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-03-13 16:41:37
Readmore >
అక్రమంగా నిల్వచేసిన 41 గ్యాస్ సిలిండర్లు సీజ్ చేసిన సూర్యపేట పోలీస్
Posted On 2026-03-13 16:39:38
Readmore >