| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సైబర్‌ నేరగాళ్లపై సిబిఐ దాడులు

సైబర్‌ నేరగాళ్లపై సిబిఐ దాడులు

డైలీ భారత్, న్యూఢిల్లీ : సైబర్‌ నేరగాళ్లపై సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సిబిఐ) మరోమారు దాడులు చేసింది. ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న వారిని లక్ష్యంగా చేసుకుని జాతీయ, అంతర్జాతీయ ఎజెన్సీల సహకారంతో 11 రాష్ట్రాల్లోని 76 చోట్ల సోదాలు నిర్వహించింది. ఆర్థిక మోసాలకు సంబంధించి ఐదు వేర్వేరు కేసులు నమోదు చేసిన సిబిఐ ఆపరేషన్‌ 'చక్రా-2' పేరుతో దాడులు చేసింది. ఫైనాన్షియల్‌ ఇంటలిజెన్స్‌ యూనిట్‌ (ఎఫ్‌ఐయు) ఇచ్చిన సమాచారంతో క్రిప్టో కరెన్సీ మోసాలకు పాల్పడుతూ దాదాపు రూ.100 కోట్ల మోసానికి సంబంధించి సిబిఐ కేసు నమోదు చేసింది. కాల్‌ సెంటర్లను ఏర్పాటు చేసుకొని సాంకేతిక సహాయ సిబ్బందిగా వ్యవహరిస్తూ విదేశీయులే లక్ష్యంగా కొందరు మోసాలకు పాల్పడుతున్నారంటూ అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌ కంపెనీలు ఫిర్యాదు చేయడంతో సిబిఐ కేసులు నమోదు చేసి, సోదాలు చేపట్టింది.

Previous నేడు దుర్గాదేవిగా దర్శనమివ్వనున్న ఇంద్రకీలాద్రి అమ్మవారు
Next పానీ పూరీ తిని 50 మంది అస్వస్థత
ADVERTISEMENT