Posted on 2024-05-28 19:29:04
ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో సంచలనం
లిక్కర్ స్కాంలో కేసీఆర్ పాత్రను వివరించిన ఈడీ
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : లిక్కర్ స్కాం గురించి కేసీఆర్కు ముందే తెలుసు అన్న ఈడీ .ఢిల్లీ హైకోర్టులో వాదనల సందర్భంగా విస్తుపోయే విషయాలు బయటపెట్టిన ఈడీ. ఢిల్లీ మద్యం విధానం, రిటైల్ వ్యాపారం గురించి తండ్రి కేసీఆర్కు ముందే వివరాలు కవిత చెప్పినట్లు వెల్లడించిన ఈడీ..తన టీం సభ్యులను ఢిల్లీలో కేసీఆర్కు ఆయన అధికారిక నివాసంలో కవిత పరిచయం చేశారని చెప్పిన ఈడీ
కవిత పరిచయం చేసిన వారి నుంచి మద్యం వ్యాపారం వివరాలు కేసీఆర్ అడిగి తెలుసుకున్నారన్న ఈడి
కవితకు బెయిలా.. అస్సలు అక్కర్లేదు! .ఈడీ, సీబీఐ కేసుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై ముగిసిన విచారణ..ఈ కేసు మొత్తంలో ఉంది ఒక్కరే మహిళ అని ఒక మహిళగా...బెయిల్ పొందే అర్హత ఉందని కవిత చెప్పిన విషయాన్ని వ్యతిరేకించిన దర్యాప్తు సంస్థలు.కవిత ఏమి సాధారణ గృహిణి కాదని.. ఒక రాష్ట్రానికి సీఎంగా పనిచేసిన వ్యక్తి కుమార్తె అని..విదేశాల్లో ఫైనాన్స్లో మాస్టర్స్ చదివి వచ్చి రాజకీయంగా ఉన్నత స్థానాలను చూశారన్న ఈడీ లాయర్
అనేక కంపెనీల్లో భాగస్వామ్యురాలిగా ఉన్నారని, మరికొన్ని సంస్థల్లో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నారని..కొన్నింటిలో అధీకృత సంతకం చేస్తే హోదాతో ఉన్నారన్న ఈడీ..కవిత ఎంత శక్తిమంతురాలో ఆమె సాక్షులను బెదిరించిన తీరు చూస్తే అర్ధమవుతుందని..
ఆ వివరాలు అన్ని కోర్టు ముందు ఉన్నాయన్న ఈడీ
మహిళగా ప్రత్యేక పరిస్థితుల దృష్ట్య బెయిల్ మంజూరు చేయాలన్న..అంశాన్ని అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న ఈడీ.కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లోనే మహిళలకు సంబంధించిన బెయిల్ ప్రత్యేకంగా..తీసుకోవాలని గతంలో ఢిల్లీ హైకోర్టు స్పష్టమైన తీర్పులు ఇచ్చిందని ప్రస్తావించిన ఈడీ
ఢిల్లీలో మద్యం వ్యాపారం చేయడం కోసం కవిత తన వద్దకు వచ్చినట్లు..మాగుంట శ్రీనివాసరెడ్డి తన వాగ్మూలంలో స్పష్టం చేశారన్న ఈడీ.అవును అంతా చెప్పేశారు!
ఈ వ్యవహారంపై మార్చి 2021లో ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రివాల్తో భేటీ అవ్వగా...కవితను కలవాలని, రూ. 100 కోట్ల వరకు పెట్టుబడి పెట్టడానికి కవిత సిద్దంగా ఉన్నారని..ఆమెతోనే సంప్రదింపులు జరపాలని చెప్పినట్లు వాగ్మూలంలో మాగుంట పేర్కొన్నారన్న ఈడీ.ఆ తర్వాత హైదరాబాద్లోని కవిత నివాసంలో భేటీ అయినట్లు చెప్పిన మాగుంట
కేజ్రీవాల్ రూ. 100 కోట్లు సర్దుబాటు చేయాలని కోరారని..అందులో రూ. 50 కోట్లు ఇవ్వాలని, ఇందుకోసం బుచ్చిబాబు వచ్చి కలుస్తాడని..కవిత చెప్పిందని మాగుంట తన వాగ్మూలంలో చెప్పారన్న ఈడీ..
ద్విచక్ర వాహనం చోరి నిందితులను చాకచక్యంగా పట్టుకున్న జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి, సిబ్బంది
Posted On 2026-04-24 19:11:00
Readmore >
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడే కారణంతో భర్తను అంతమొందించేందుకు ఓ భార్య పన్నాగం
Posted On 2026-04-24 11:24:14
Readmore >