Posted on 2024-04-15 15:27:51
డైలీ భారత్, మెదక్: మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్.పి డా. .బి.బాలస్వామి ఆద్వర్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబందిత అధికారులకు పలు సూచనలు చేయడమైనది ఈ కార్యక్రమంలో తూప్రాన్ గ్రామం మరియు మండలానికి చెందిన గోలి శ్రీనివాస్
మా తల్లి గోలి ప్రమీల పేరు పై 1521 Sq విస్తీర్ణంలో ఓపెన్ ప్లాట్ (అందుబాటులో ఉన్న భూమి విస్తీర్ణం 1170 చ. గజాలు) మెదక్ జిల్లా శివంపేట గ్రామం మరియు మండలంలో ఉందని అట్టి ప్లాట్ ని శివ్వంపేట గ్రామ మాజీ సర్పంచ్ పులిమామిడి స్రవంతి W/o పులిమామిడి నవీన్ కుమార్ అనే వ్యక్తి సంతకాలను ఫోర్జరీ చేసి శివ్వంపేట గ్రామ పంచాయతీ కార్యాలయ లెటర్ హెడ్లపై 05-04-2019 తేదీన రెండు యాజమాన్య ధృవీకరణ పత్రాలను సృష్టించారని కావున
నా భూమిపై నకిలీ పత్రాలు సృష్టించిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయగరలని ఫిర్యాదు చేయగా చట్టప్రకారం ఫిర్యాదికి తగిన న్యాయం చేయమని శివంపేట్ ఎస్.ఐ. కి సూచనలు చేయటం జరిగింది. అలాగే నార్సింగి గ్రామానికి చెందిన తిప్పరబోయిన సిద్ది రాములు నా కూతురు పెళ్లి చేసినందున అప్పులు అయినవని నా స్వంత స్ధలము విక్రయించుకుందామని అకుంటుండగ తిప్పరబోయిన మా పాలివారైన సత్యం అనేవ్యక్తి నాకుటంబాన్ని చంపేస్తానని బెదిరిస్తూ భూతుమాటలు తిడుతున్నాడని కావున నాకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేయగా చట్టప్రకారం ఫిర్యాదికి తగిన న్యాయం చేయమని నార్సింగ్ ఎస్.ఐ. కి సూచనలు చేయటం జరిగింది.
కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్ చైర్మన్ల నియామకం
Posted On 2026-08-25 17:39:09
Readmore >
రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక
Posted On 2026-08-25 10:02:35
Readmore >
కుసుమ రామయ్య ZPHS విద్యార్థుల NCC క్యాంపు ప్రయాణం - "A" సర్టిఫికెట్ దిశగా అడుగులు
Posted On 2026-08-25 07:42:04
Readmore >
మతం మారాలని సౌజన్యపై సాధిక్ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ
Posted On 2026-08-25 03:53:32
Readmore >
జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం
Posted On 2026-08-24 14:25:56
Readmore >