Posted on 2024-04-14 19:37:15
ఫోన్ రిపేరుకు ఇచ్చి.. పోలీసులకు చిక్కి. ఎన్ఐఏ కస్టడీలో బెంగళూరు బ్లాస్ట్ నిందితులు!
డైలీ భారత్, బెంగళూరు: బెంగళూరులోని రామేశ్వరం కెఫే బాంబు పేలుడు కేసులో ఇద్దరు కీలక నిందితులను జాతీయ విచారణ సంస్థ (NIA) ఇటీవల అరెస్టు చేసిన విషయం తెలిసిందే..
అయితే, మార్చి 1న చోటుచేసుకున్న ఆ ఘటన అనంతరం పారిపోయిన నిందితులు.. నెలన్నర రోజులుగా వివిధ రాష్ట్రాల్లో తప్పించుకు తిరిగారు. ఈ క్రమంలో 35 సిమ్లు, ఫేక్ ఆధార్, డ్రైవింగ్ లైసెన్సులతో దర్యాప్తు సంస్థలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ చివరకు ఓ సెల్ఫోన్ను రిపేర్కు ఇచ్చి పోలీసులకు దొరికిపోవడం గమనార్హం.
కోల్కతాలో అరెస్టైన ముసావిర్ హుస్సేన్ షాజిబ్, అబ్దుల్ మథీన్ అహ్మద్ తాహాలను ఎన్ఐఏ కీలక నిందితులుగా అనుమానిస్తోంది. దాడి తర్వాత ఈ ఇద్దరు నిందితులు అనేక రాష్ట్రాలు తిరుగుతూ చివరకు పశ్చిమ బెంగాల్ చేరుకున్నారు. ఈ క్రమంలో అనేక హోటళ్లలో తలదాచుకున్నారు. సెల్ఫోన్లను తరచూ మార్చిన నిందితులు దాదాపు 35 సిమ్ కార్డులు వాడారు. కోల్కతాలోని ఎస్ప్లనేడ్ ప్రాంతంలోని కొన్నిరోజులు బసచేశారు. ఈ క్రమంలో ఓ నిందితుడి సెల్ఫోన్లో సమస్య తలెత్తింది. దాంతో అక్కడి చాంద్నీ చౌక్ మార్కెట్లోని ఓ దుకాణంలో రిపేర్కు ఇచ్చారు. ఫోన్లో మాత్రం సిమ్కార్డులు లేవు.
మైక్రోఫోన్లో ఏదైనా సమస్య ఉందా?అని తెలుసుకుందామనుకున్న దుకాణం యజమాని.. అతడి దగ్గరున్న ఓ సిమ్ కార్డును అందులో పెట్టి చూశాడు. అదే నిందితులను పట్టించేందుకు మార్గం చూపింది. ఆ సాయంత్రం నిందితుడు వచ్చి ఫోన్ అడిగినప్పటికీ.. ఇంకా రిపేర్ కాలేదని, మరుసటి రోజు రావాలని చెప్పడంతో వెనుదిరిగి పోయాడు. అప్పటికే నిందుతుల ఫోన్ను ట్రాక్ చేస్తున్న పోలీసులు.. ఆ మొబైల్లో వేసిన సిమ్కార్డు సిగ్నల్స్తో అప్రమత్తమయ్యారు. ఫోన్ ఐఎంఈఐ నంబరు ఆధారంగా ఫోన్ ఆచూకీ కనుగొన్నారు. మొబైల్ షాప్నకు చేరుకున్న దర్యాప్తు అధికారులు.. యజమాని స్టేట్మెంట్ రికార్డు చేసుకున్నారు. అందులో ఒకరు పెట్టుకున్న క్యాప్ కూడా వారి ఆచూకీ గుర్తించేందుకు దోహదపడినట్లు తెలిసింది. చివరకు కోల్కతా శివారులోని దిఘా ప్రాంతంలోని ఓ హోటల్లో ఉన్న ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ప్రస్తుతం ఎన్ఐఏ కస్టడీలో ఉన్నారు..
కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్ చైర్మన్ల నియామకం
Posted On 2026-08-25 17:39:09
Readmore >
రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక
Posted On 2026-08-25 10:02:35
Readmore >
కుసుమ రామయ్య ZPHS విద్యార్థుల NCC క్యాంపు ప్రయాణం - "A" సర్టిఫికెట్ దిశగా అడుగులు
Posted On 2026-08-25 07:42:04
Readmore >
మతం మారాలని సౌజన్యపై సాధిక్ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ
Posted On 2026-08-25 03:53:32
Readmore >
జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం
Posted On 2026-08-24 14:25:56
Readmore >