Posted on 2024-03-19 18:17:52
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్లో రైటర్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ సురేందర్ రైటర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. మెదక్ మండలం అవుసుల పల్లికి చెందిన కందుల రాములు ఇసుక ట్రాక్టర్ విడుదల విషయంలో రైటర్ సురేందర్ రూ. 15 వేలు డిమాండ్ చేశాడు. డబ్బులు ఇస్తేనే ఇసుక ట్రాక్టర్ విడుదల చేస్తామని చెప్పడంతో రూ. 15 వేలు రైటర్ సురేందర్తో ఒప్పందం కుదుర్చుకొని మొదటగా నాలుగు వేలు ఇచ్చేందుకు అంగీకరించాడు. డబ్బులు డిమాండ్ చేసిన కానిస్టేబుల్ పై బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. బాధితుడితో మాట్లాడిన అధికారులు మంగళవారం పక్కా ప్రణాళికతో వచ్చి డబ్బులు నాలుగు వేలు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది.. వారం రోజుల క్రితం పది వేలు ఇచ్చిన బాధితుడు మరోసారి డిమాండ్ చేయడం వల్లనే ఏసీబీనీ ఆశ్రయించినట్లు తెలిసింది. పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు.
సిరిసిల్ల విద్యుత్ శాఖ ఎస్ఈగా టి. వేణుమాధవ్ బాధ్యతల స్వీకరణ
Posted On 2026-04-14 18:35:16
Readmore >
సత్తా చాటిన సెస్ బాలికల జూనియర్ కళాశాల ,సిరిసిల్ల : జిల్లాలోనే ప్రథమ స్థానం
Posted On 2026-04-14 18:02:15
Readmore >
జులూరుపాడు మండలం చండుగొండ క్రాస్ రోడ్ అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో 135 వ జయంతి వేడుకలు
Posted On 2026-04-14 16:38:34
Readmore >
జూలూరుపాడు మండలం లో భారతరత్న బిఆర్ అంబేద్కర్ 135 వ జయంతి వేడుకలు
Posted On 2026-04-14 15:44:35
Readmore >
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మహిళా మావోయిస్టు రూపిరెడ్డి మృతి
Posted On 2026-04-14 14:51:33
Readmore >