Posted on 2024-03-19 18:17:52
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్లో రైటర్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ సురేందర్ రైటర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. మెదక్ మండలం అవుసుల పల్లికి చెందిన కందుల రాములు ఇసుక ట్రాక్టర్ విడుదల విషయంలో రైటర్ సురేందర్ రూ. 15 వేలు డిమాండ్ చేశాడు. డబ్బులు ఇస్తేనే ఇసుక ట్రాక్టర్ విడుదల చేస్తామని చెప్పడంతో రూ. 15 వేలు రైటర్ సురేందర్తో ఒప్పందం కుదుర్చుకొని మొదటగా నాలుగు వేలు ఇచ్చేందుకు అంగీకరించాడు. డబ్బులు డిమాండ్ చేసిన కానిస్టేబుల్ పై బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. బాధితుడితో మాట్లాడిన అధికారులు మంగళవారం పక్కా ప్రణాళికతో వచ్చి డబ్బులు నాలుగు వేలు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది.. వారం రోజుల క్రితం పది వేలు ఇచ్చిన బాధితుడు మరోసారి డిమాండ్ చేయడం వల్లనే ఏసీబీనీ ఆశ్రయించినట్లు తెలిసింది. పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు.
విత్తనాల ఎంపిక మరియు విత్తనాలు కొనుగోలులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు : వ్యవసాయ అధికారి నర్సింహులపేట
Posted On 2024-05-16 22:34:57
Readmore >డెంగ్యూ వ్యాధి ప్రజారోగ్యానికి పెను సమస్య: జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బి.కళావతి బాయి
Posted On 2024-05-16 21:46:48
Readmore >ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్
Posted On 2024-05-16 17:38:06
Readmore >ఇచ్చిన హామీల్లో మరోదానికి ఎగనామం? సన్న వడ్లకే బోనస్ అంటున్న రేవంత్ రెడ్డి
Posted On 2024-05-16 14:12:24
Readmore >భర్త కురుకురే ప్యాకెట్లు తేలేదని విడాకులకు అప్లై చేసిన భార్య
Posted On 2024-05-16 09:54:06
Readmore >