| Daily భారత్
Logo




నిబంధనల మేరకు ఎన్నికల ప్రచార సామాగ్రి ముద్రణ చేపట్టాలి:కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి

News

Posted on 2023-10-12 19:55:37

Share: Share


నిబంధనల మేరకు ఎన్నికల ప్రచార సామాగ్రి ముద్రణ చేపట్టాలి:కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రచార సామాగ్రి ముద్రణను నిబంధనల  ప్రకారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోనీ ప్రింటింగ్ ప్రెస్ యజమానులు  నిర్వహించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి తెలిపారు.ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఎన్నికల కరపత్రాలు, పోస్టర్లు, ఇతర మెటీరియల్ ముద్రించినప్పుడు లేదా ప్రచురించినప్పుడు తప్పనిసరిగా ప్రింటర్, ప్రచురణ కర్త పేర్లు, చిరునామా, సెల్ ఫోన్ నెంబర్లు ప్రింట్ లైన్ యందు స్పష్టంగా సూచించాలని, ముద్రించబడిన ప్రతులను ( ప్రింటడ్ మెటీరియల్ కాపీలను) 3 అదనపు ప్రింట్ లతో పాటు ప్రింట్ చేసిన మూడు రోజుల్లోపు ప్రచరణ కర్త నుండి పొందిన డిక్లరేషన్ తో  సహా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయం నందు ప్రజా  ప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 127(ఏ) ప్రకారం పంపాలని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు.

జిల్లాలోని ప్రింటింగ్ ప్రెస్ లు ఎన్నికల కరపత్రాలు, పోస్టర్లు, మొదలైన వాటి ముద్రణ చేపట్టే ముందు నిర్దేశించిన ప్రోఫార్మా లో సెక్షన్ 127 ఏ (2) ప్రకారం ప్రచురణకర్త నుంచి డిక్లరేషన్ పొందాలని, డిక్లరేషన్ పై ప్రచురణకర్త సంతకం, సూచించిన ఇద్దరు వ్యక్తులచే ధ్రువీకరించబడాలని, దీనిని జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయానికి పంపే సమయంలో ప్రింటింగ్ ప్రెస్ యజమాని ధ్రువీకరించాలని తెలిపారు ప్రింటర్ మెటీరియల్ డిక్లరేషన్ తో పాటు సూచించిన ప్రొఫార్మాలో ముద్రించిన డాక్యుమెంట్ కాపీల సంఖ్య సదరు ప్రింటింగ్ పనికి వసూలు చేసిన ధరకు సంబంధించిన సమాచారాన్ని కూడా ప్రింటర్లు మూడు రోజుల్లోపు అందించాలని, అట్టి ప్రతి ముద్రించిన మూడు రోజుల్లోపు ముద్రించిన ఎన్నికల కరపత్రాలు పోస్టర్లు మొదలైన వాటికి సంబంధించిన సమాచారాన్ని ప్రింటర్ ఒకేసారి కాకుండా విడిగా అందించాలని, ఈ ఆదేశాలు ఉల్లంగిస్తే చట్ట ప్రకారం ప్రింటింగ్ ప్రెస్ లైసెన్స్ రద్దు చేయడంతో సహా ప్రింటింగ్ ప్రెస్ యజమానిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ ,జిల్లా ఎన్నికల అధికారి ఆ ప్రకటనలో పేర్కొన్నారు ముద్రించిన కరపత్రాలు, పోస్టర్లు ఇతర ప్రచార సామాగ్రిని నిర్ధేశించిన సంఖ్యకు మించి జీరాక్సులు తీయడం, పలు పత్రాలుగా సంఖ్య పెంచి పంపిణీకి వినియోగించినచో, ఎన్నికల నియమావళి ఉల్లంఘించినట్లుగా భావించి ఆరు నెలలు జైలు శిక్ష, రెండు వేలు జరిమానా లేదా రెండు శిక్షలు కూడా అమలు చేయబడుతాయన్నారు.

Image 1

గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళకు సకాలంలో రక్తం అందజేత

Posted On 2026-04-29 19:01:13

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : హత్య కేసులో నలుగురు నిందుతులకు యావజ్జీవ కారాగార (జీవిత ఖైదు) శిక్ష

Posted On 2026-04-29 18:50:39

Readmore >
Image 1

చలివేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్ రావుల వినోద ప్రభాకర్

Posted On 2026-04-29 18:41:17

Readmore >
Image 1

మంత్రి సీతక్కని కలిసిన కామారెడ్డి జిల్లా డిసిసి ఉపాధ్యక్షులు గంప ప్రసాద్

Posted On 2026-04-29 18:39:55

Readmore >
Image 1

పదవ తరగతి ఫలితాల్లో పాపకొల్లు జడ్పీహెచ్ఎస్ మండల టాపర్ కే పూజిత 565

Posted On 2026-04-29 18:37:39

Readmore >
Image 1

ఆస్తి కోసం కన్నవారిపై కక్ష... సొంత ఇంటికే నిప్పు పెట్టిన కుమార్తె!..

Posted On 2026-04-29 17:26:42

Readmore >
Image 1

హుస్నాబాద్‌లో అబ్బురపరిచే గాజు వంతెన !

Posted On 2026-04-29 08:29:53

Readmore >
Image 1

సోదరి అస్థిపంజరంతో బ్యాంకుకు వెళ్లిన గిరిజనుడు

Posted On 2026-04-28 23:09:39

Readmore >
Image 1

కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి

Posted On 2026-04-28 22:51:46

Readmore >
Image 1

విలువలు కూలిపోతున్న నాలుగవ స్తంభం...?

Posted On 2026-04-28 22:47:26

Readmore >