Posted on 2023-10-12 18:01:11
10వ వార్డు కౌన్సిలర్ బోల్గం నాగరాజు
వారం క్రితం కలెక్టర్ కు వినతి, స్పందించని డిఇఓ
డైలీ భారత్, సిరిసిల్ల: పట్టణంలోని పదో వార్డు మున్సిపాలిటీ పరిధిలోని ముష్టిపల్లిలోని ప్రాథమిక పాఠశాలను వెంటనే తెరిపించాలని పదో వార్డు కౌన్సిలర్ బొల్గం నాగరాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం కాలనీ వాసులతో కలిసి ఆయన పాఠశాల ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ నాగరాజు మాట్లాడుతూ గత రెండున్నర సంవత్సరాల నుంచి ప్రాథమిక పాఠశాల మూసి ఉందని, వారం రోజుల క్రితం జిల్లా అదనపు కలెక్టర్ కు వినతి పత్రం అందజేశామన్నారు. మూడు రోజుల్లో పాఠశాలను తెరిపించాలని డిఈఓ కు కలెక్టర్ ఆదేశాలు ఇచ్చినా, ఇప్పటివరకు జిల్లా విద్యాశాఖ అధికారి స్పందించకపోవడం శోచనీయమన్నారు. ఇప్పాడికే పాఠశాలలో పనిచేసే ఇద్దరు ఉపాధ్యాయులను దగ్గరలోని రాజీవ్ నగర్ పాఠశాలకి డిప్యూటేషన్ పై పంపించడం జరిగిందన్నారు. దీనివల్ల పిల్లల భారత రాజ్యాంగంలో తెలుపబడిన ఆర్టికల్ 21 ఏ ఉల్లంఘనకు గురికాబడిందన్నారు. ఈ ఆర్టికల్ ప్రకారం ప్రకారం 6 నుంచి 14 సంవత్సరాలలోపు బాల, బాలికలకు కచ్చితంగా ఉచిత నిర్బంధ విద్యను అందించాల్సిన విది ప్రభుత్వానికి ఉంటుందని, ఈ రెండు సంవత్సరాల నుండి ముష్టిపల్లిలోని బాల బాలికలు పాఠశాలకు వెళ్ళ లేక పోతున్నారని, ఈ పాఠశాల మూసివేత వల్ల వేల రూపాయలు కట్టలేక ప్రైవేట్ స్కూల్స్ కి పంపలేక తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారన్నారు. వెంటనే పాఠశాలను తెరిచి, ఇద్దరి ఉపాధ్యాయుల డిప్యూటేషన్ రద్దుచేసి, పిల్లలకు ఉచిత విద్య అందించాలని నాగరాజు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్య కమిట పాల్గొన్నారు.
విశ్వవిద్యాలయ విద్యార్థుల ఆలోచనలు వారి భవిష్యత్ను గొప్పగా నిర్మించుకునేలా ఉండాలి
Posted On 2026-03-11 20:27:35
Readmore >
కామారెడ్డి పట్టణ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ, ఫుట్ ఓవర్ బ్రిడ్జి, ROB ల నిర్మాణం
Posted On 2026-03-11 20:23:40
Readmore >
కౌలు పేరుతో గిరిజన రైతు జామాయిల్ తోటను ద్వంసం చేసిన గిరిజనేతరుల పై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ అశ్వరావుపేట నియోజక వర్గ నాయకులు తంబల్ల రవి
Posted On 2026-03-11 19:25:18
Readmore >
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలను సన్మానించిన జిల్లా కలెక్టర్
Posted On 2026-03-11 18:48:15
Readmore >
పుట్టు వెంట్రుకల కార్యక్రమంలో పాల్గొన్న మున్నూరు కాపు సంఘం నాయకులు
Posted On 2026-03-11 18:46:41
Readmore >