Posted on 2024-02-29 08:49:27
డైలీ భారత్, ఝార్ఖండ్:జార్ఖండ్లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. రైల్వే ట్రాక్ దాటుతున్న వ్యక్తులను ఓ ఎక్స్ప్రెస్ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 12 మంది దుర్మరణం చెందినట్లు సమాచారం.
రైల్లో మంటలు చెలరేగ డంతో భయాందోళనతో ప్రయాణికులు కిందకు దూకేశారు.అదే సమ యంలో ఝఝా-అసన్సోల్ రైలు ఎదురుగా వస్తోంది. దీంతో ఆ రైలు ఢీకొని ప్రాణాలు కోల్పోయారు
ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అక్కడి పరిస్థితుల ఆధారంగా.. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అధికారులు చెబుతున్నారు.
బుధవారం సాయంత్రం జంతారా జిల్లా కళా ఝారియా రైల్వే స్టేషన్ వద్ద ఈ ఘటన చోటుచేసు కుంది. అసాన్సోల్-ఝాఝా మధ్య నడిచే ఎక్స్ప్రెస్ రైలు వీళ్లను ఢీ కొట్టినట్లు తెలుస్తోంది.
ఘటనాస్థలానికి చేరుకున్న వైద్య బృందాలు, అంబు లెన్స్లు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ఘటనకు సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది
మహిళా కానిస్టేబుల్ను అవమానించిన నాగరాజుపై షాద్నగర్ పోలీసుల యాక్షన్
Posted On 2026-05-04 09:57:57
Readmore >
గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-05-02 23:56:32
Readmore >