Posted on 2024-02-28 17:31:01
ఎస్ ఆర్ ఆర్ ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ భాగ్యనగర్ రాజగోపాల్
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: జాతీయ సైన్స్ దినోత్సవ పురస్కరించుకొని కుసుమ రామయ్య జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల శివనగర్ సిరిసిల్లలో ఈరోజు సైన్స్ వారోత్సవాల సందర్భంగా డ్రాయింగ్ మరియు క్విజ్ పోటీలు నిర్వహించడం జరిగినది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ భాగ్యనగర్ రాజగోపాల్ విద్యార్థుల ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు మూఢనమ్మకాలకు దూరంగా ఉండాలని సైన్స్ ను మాత్రమే నమ్మాలని, ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని నూతన ఆవిష్కరణలకు నాంది పలకాలని కోరారు. మన దేశాన్ని అభివృద్ధి చెందిన భారతదేశంగా మార్చే గొప్ప అవకాశం నేటితరం విద్యార్థులదే అని అన్నారు. ప్రపంచ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో అందిపుచ్చుకోడంలో భారతదేశ మొదటి ఐదు దేశాల్లో ఉంది అని తెలియజేశారు. శాస్త్రీయ పరిజ్ఞానాన్ని విద్యార్థులలో శాస్త్రీయ పరిజ్ఞానాన్ని పెంచే గురితర బాధ్యత ఉపాధ్యాయుల పైన ఉన్నది అన్నారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎల్ మోతిలాల్ అధ్యక్షత వహించారు.
ఈ కార్యక్రమంలో స్టాఫ్ సెక్రటరీ మల్లార పు పురుషోత్తం సైన్స్ ఉపాధ్యాయులు పాకాల శంకర్ గౌడ్, సరిత, శ్రీహరి, రజిత, అజయ్ నారాయణ మరియుపాఠశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు
గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-05-02 23:56:32
Readmore >
మర్రిపల్లి ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలి : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-05-02 23:48:08
Readmore >