Posted on 2024-02-28 17:38:24
డైలీ భారత్ హన్మకొండ:హన్మకొండ జిల్లా బీమ దేవరపల్లి మండలం వంగరలో ఎంపి బండి సంజయ్ కుమార్ ప్రజాహిత యాత్రలో ఈరోజు ఉద్రిక్తత చోటుచేసు కుంది.
ఎంపి బండి సంజయ్ కుమార్ కాన్వాయ్పై కోడిగుడ్లతో దాడి చేశారు. కోడిగుడ్ల దాడిపై బిజెపి ఎంపి బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలీసుల సమక్షంలో దాడి జరిగినా పట్టించుకోలేదని మండిపడ్డారు. తనకు భద్రత అక్కర్లేదని, పోలీసులు వెళ్లిపోవాలని బండి సంజయ్ సూచిం చారు.
తన రక్షణ సంగతి బిజెపి కార్యకర్తలే చూసుకుంటారని దుయ్యబట్టారు. మంత్రి పొన్నం ప్రభాకర్కు వ్యతిరే కంగా బిజెపి కార్యకర్తలు నినాదాలు చేశారు.
తెలంగాణ వ్యాప్తంగా బిజెపి నేతలు ప్రజాహిత యాత్ర చేస్తున్న విషయం తెలి సిందే. పార్లమెంట్ ఎన్నిక లలో బిజెపి-కాంగ్రెస్ నాయకులు ఢీ అంటే ఢీ అన్నట్టుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి.
లోక్ సభ ఎన్నికల నేప థ్యంలో బిజెపి పలుచోట్ల బలమైన ఎంపి అభ్య ర్థులను పోటీ చేయిం చడానికి కసరత్తు చేస్తుంది.
గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-05-02 23:56:32
Readmore >
మర్రిపల్లి ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలి : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-05-02 23:48:08
Readmore >