| Daily భారత్
Logo




గ్రీవెన్స్ దరఖాస్తులను పరిష్కరించాలి: అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎం.డేవిడ్

News

Posted on 2024-02-26 20:13:17

Share: Share


గ్రీవెన్స్ దరఖాస్తులను పరిష్కరించాలి: అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎం.డేవిడ్

డైలీ భారత్, మహబూబాబాద్: గ్రీవెన్స్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎం.డేవిడ్ తెలిపారు.

సోమవారం ఐ.డి.ఓ.సి లోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎం.డేవిడ్ ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు. అధికారులు గ్రీవెన్స్ లో వచ్చిన ధరఖాస్తులను పరిష్కరించి ప్రజలకు సమాధానం తెలుపాలని అన్నారు.

ఈ సందర్బంగా మరిపెడ మండలం చిల్లంచర్ల గ్రామానికి చెందిన తాళ్ల సోమలక్ష్మి గ్రామంలోని తనకు చెందిన భూమి సర్వే నెం.110,111,112 గల మిగులు భూమి వేరే ఇతర వ్యక్తులు తమ పేర్లపై నమోదు చేసుకున్నారని రీ సర్వే చేసి తన భూమిని తనకు రిజిస్ట్రేషన్ చేసి పట్టా ఇవ్వాలని కోరారు.

తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామానికి చెందిన డొనుక సౌజన్య, తను వికాలంగురాలినని హైదరాబాద్ మెడికల్ బోర్డు ద్వారా జారీ చేసిన తన అంగవైకల్యానికి సంబంధించిన సర్టిఫికేట్ ఉన్నందున, వికాలాంగులకు ఇచ్చే ఫించను లో నమోదు చేసి తనకు లభ్ది చేకూర్చాలని కోరారు.

ఇరుగు వెంకటేష్,కప్పల సాయికిరణ్ షెడ్యుల్డ్ కులాల హాస్టల్ నందు గత 8 నెలల నుండి ఔట్ సోర్సింగ్ ఉద్యోగం చేస్తున్నా తమకు జీతాలు రాక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని జీతాలు ఇప్పించి ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు.

కేసముద్రం మండల కేంద్రంలో ప్రభుత్వం వారు ఇచ్చిన ఇళ్ళ స్థలాలలో ఇళ్ళ నిర్మాణం చేపడుతుంటే ఇతర వ్యక్తులు అడ్డుకుని ఇళ్ళ నిర్మాణం లో అడ్డు తగులుతున్నారని ప్రభుత్వం ఇచ్చిన స్థలాలలో నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న వ్యక్తులపై చర్యలు చేపట్టాలని కోరారు.

ఈ రోజు నిర్వహించిన గ్రీవెన్స్ లో (76) దరఖాస్తులను  వివిధ శాఖల అధికారులకు పరిష్కారానికి ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ రమాదేవి, సిపిఓ సుబ్బారావు,  జిల్లా అధికారులు, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Image 1

చర్ల మండలంలో ఎన్సీపీ పార్టీలో 100 మంది యువకుల చేరిక

Posted On 2026-06-24 21:32:58

Readmore >
Image 1

ఐటీసీ కార్మికుల కు డ్రగ్స్ పై అవగాహనా కార్యక్రమం నిర్వహించిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్

Posted On 2026-06-24 21:31:42

Readmore >
Image 1

ఫ్యాన్ కు ఉరివేసుకొని మహిళా ఆత్మహత్య

Posted On 2026-06-24 19:18:46

Readmore >
Image 1

నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు : జూలూరుపాడు ఎస్‌ఐ జీనత్ కుమార్

Posted On 2026-06-24 19:13:12

Readmore >
Image 1

విద్యార్థుల భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పోరాటం

Posted On 2026-06-24 19:11:52

Readmore >
Image 1

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి, 8 మందికి గాయాలు

Posted On 2026-06-24 17:55:51

Readmore >
Image 1

రాజారెడ్డి జనసేన ట్రస్టు ద్వారా పాఠశాలకు బెంచిలు, డెస్కులు పంపిణీ : ప్రధానోపాధ్యాయులు ధీటి మోహన్

Posted On 2026-06-24 17:51:09

Readmore >
Image 1

జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇస్తాం... కలెక్టర్ హామీ

Posted On 2026-06-24 17:45:21

Readmore >
Image 1

రూ. వేయి కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా

Posted On 2026-06-24 17:44:27

Readmore >
Image 1

కేటీఆర్ సహా పలువురు ప్రముఖుల శుభాకాంక్షల మధ్య గంపా గృహప్రవేశం

Posted On 2026-06-24 12:21:19

Readmore >