Posted on 2024-02-26 20:11:28
డైలీ భారత్, మహబూబాబాద్: ఆర్థిక వ్యవహారాలలో ప్రజల్లో చైతన్యం పెంచేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు అదనపు కలెక్టర్ డేవిడ్ తెలిపారు.
సోమవారం భారతీయ రిజర్వ్ బ్యాంకు రూపొందించిన పోస్టర్లను, పుస్తకాలను జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ జిల్లా అధికారులతో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆదనపు కలెక్టర్ మాట్లాడుతూ... ఆర్థిక వ్యవహారాలపై ప్రజల్లో చైతన్యం అవసరమన్నారు.
అదేవిధంగా సైబర్ క్రైమ్ పట్ల అప్రమత్తత అవసరమన్నారు.
బ్యాంకు లావాదేవీల పట్ల నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలని అందుకు కావలసిన నైపుణ్యాలను పెంపొందించుకొని రుణాలపై విస్తృత అవగాహన పొందాలని సూచించారు.
రుణాలపై అవగాహన లేకుండా పొందకూడదన్నారు.
ప్రజలు కూడా తమ సొమ్మును కూడబెట్టుకోవడంతోపాటు పెంపొందించుకునేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయని వాటిని తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
స్థిరాస్తుల కోసం ఉన్నత విద్య కోసం రుణాలు పొందవచ్చునని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో రమాదేవి డి ఆర్ డి ఎ పిడి పురుషోత్తం, పశుసంవర్ధక శాఖ అధికారి సుధాకర్ ఎస్సీ వెల్ఫేర్ ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాలరాజు బీసీ వెల్ఫేర్ నరసింహస్వామి ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-05-02 23:56:32
Readmore >
మర్రిపల్లి ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలి : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-05-02 23:48:08
Readmore >