Posted on 2024-02-26 19:05:21
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు పత్రిక సమావేశం నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ మండల అధ్యక్షులు జలగం ప్రవీణ్ మాట్లాడుతూ గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టిందని బి ఆర్ఎస్ పాలనలో ప్రజలను వేధించిన నాయకులకు తగిన బుద్ధి చెబుతామని, కాంగ్రెస్ చేపడుతున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేకే బిఆర్ఎస్ నాయకులు అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని కొందరు బిఆర్ఎస్ నాయకులు నోరు అదుపులో పెట్టుకోవాలని ఎద్దేవా చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రెండు పథకాలు అమలు చేశామని ప్రియాంక గాంధీ చేతుల మీదుగా మంగళవారం రోజున మరో రెండు పథకాలు గృహ జ్యోతి, గృహలక్ష్మి అమలు కాబోతున్నాయని ఈ సందర్భంగా తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంతో సబ్బండా వర్గాల ప్రజలకు సమన్యాయం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమం లో మండల కాంగ్రెస్ అధ్యక్షులు జలగం ప్రవీణ్,నెరల్లా నరసింగం,లింగాల భూపతి,గుగ్గుళ్ల శ్రీకాంత్,పొన్నాల పరుశురాం,ఎగుర్ల ప్రశాంత్,మోర లక్ష్మిరాజం,ఆసాని సత్యనారాయణ రెడ్డి,సామల గణేష్,బాలసాని శ్రీనివస్,మచ్చ శ్రీను,బండి పరుశురాం,గోగు తిరుపతి,కొల శంకర్,యండి సలీం,అలువాల మల్లేశం తదితరులున్నారు.
గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-05-02 23:56:32
Readmore >
మర్రిపల్లి ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలి : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-05-02 23:48:08
Readmore >