| Daily భారత్
Logo




కామారెడ్డి జిల్లా :ఆహార నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి

News

Posted on 2026-08-31 14:42:24

Share: Share


కామారెడ్డి జిల్లా :ఆహార నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి

డైలీ భారత్, కామారెడ్డి : కామారెడ్డి పట్టణంలోని న్యూ బస్ స్టాండ్ పరిసరాల్లో ఉన్న పలు హోటళ్లు, రెస్టారెంట్లను ఆహార భద్రతాధికారి జి. విక్రమ్ సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార పదార్థాల తయారీ, నిల్వ, వంటశాలల పరిశుభ్రత, వినియోగిస్తున్న పరికరాలను పరిశీలించారు.

తనిఖీల్లో కొన్ని హోటళ్లు, రెస్టారెంట్ల వంటశాలలు అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించినట్లు ఆహార భద్రతాధికారి తెలిపారు. అదేవిధంగా ఆహార పదార్థాల తయారీలో స్టెయిన్‌లెస్ స్టీల్ కత్తులకు బదులుగా ఇనుప కత్తులను వినియోగిస్తున్నట్లు గుర్తించామని పేర్కొన్నారు.

ఆహార పదార్థాల తయారీ, విక్రయాల్లో పరిశుభ్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని ఆహార భద్రతాధికారి జి. విక్రమ్ హోటల్, రెస్టారెంట్ యజమానులకు సూచించారు. నిబంధనలు పాటించని సంబంధిత యజమానులకు మెరుగుదల నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.

నోటీసుల్లో పేర్కొన్న సూచనలను నిర్దేశిత సమయంలోగా అమలు చేసి వంటశాలల్లో పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించాలని సూచించారు. తనిఖీల సందర్భంగా గుర్తించిన లోపాలను సరిదిద్దకపోతే, ఆహార భద్రతా నిబంధనల ప్రకారం సంబంధిత వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన ఆహారం అందేలా హోటళ్లు, రెస్టారెంట్లలో నిరంతరం తనిఖీలు నిర్వహిస్తామని ఆహార భద్రతాధికారి జి. విక్రమ్ తెలిపారు.

Image 1

కామారెడ్డి జిల్లా :ఆహార నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి

Posted On 2026-08-31 14:42:24

Readmore >
Image 1

పంచజన్య సంకల్ప సభకు కామారెడ్డి నుంచి భారీగా తరలిన కార్యకర్తలు

Posted On 2026-08-31 14:40:45

Readmore >
Image 1

మహిళలకు కుటీర పరిశ్రమ ఏర్పాటు అభినందనీయం : సిరిసిల్ల కాంగ్రెస్ అధ్యక్షుడు సుర దేవరాజు

Posted On 2026-08-31 13:50:27

Readmore >
Image 1

వెయ్యి గొంతులు.. ఒక్కటే శబ్దం.. రావులపాలెంలో మార్మోగిన వేమన శతకం

Posted On 2026-08-31 13:49:27

Readmore >
Image 1

హైదరాబాద్ లో దారుణం... నర్సును గొంతు నులిమి హత్య, మృతదేహంపై అత్యాచారం అనుమానం

Posted On 2026-08-31 04:01:07

Readmore >
Image 1

సిరిసిల్లలో పెళ్లి మండపం వద్ద గొడవ... పలువురిపై కేసు నమోదు

Posted On 2026-08-30 18:04:50

Readmore >
Image 1

ఉద్యమకారుల హక్కుల సాధనే లక్ష్యం... నూతన JAC చైర్మన్ గజ్జెల దేవరాజ్

Posted On 2026-08-30 17:15:04

Readmore >
Image 1

రైతుల భూములను రైతులకే తిరిగి ఇవ్వాలి - స్థానిక ఎమ్మెల్యే తక్షణమే స్పందించాలి : బీజేపీ డిమాండ్

Posted On 2026-08-30 15:06:17

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కాంగ్రెస్ నాయకుల భూమిపూజ

Posted On 2026-08-30 15:04:21

Readmore >
Image 1

బాహ్య మూల్యాంకన విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి : TPTF జిల్లా అధ్యక్షులు చింతల లింగం

Posted On 2026-08-30 14:01:50

Readmore >