Posted on 2026-07-11 16:27:29
డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా: బాలికపై లైంగిక వేధింపుల కేసులో పోలీసుల తీరుపై బాధిత కుటుంబం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బాలిక మేనమామ నరేష్ మాట్లాడుతూ.. తమ మేనకోడలిని రాజ్కుమార్ అనే వ్యక్తి లైంగికంగా వేధించాడని, ఈ విషయాన్ని బయటపెడితే చంపేస్తానంటూ రాజ్కుమార్ తమ కుటుంబాన్ని బెదిరించాడని తెలిపారు.
2026 మే 16న షాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ, పోలీసులు దానిని సీరియస్గా తీసుకోలేదని ఆరోపించారు. అంతేకాకుండా, 2025 మార్చి 4న బాలిక తండ్రి మల్లేష్ ఆకస్మికంగా మరణించగా, మల్లేష్ను చంపినట్టే మిమ్మల్నీ చంపుతాను అంటూ నిందితుడు తమ కుటుంబాన్ని బెదిరించాడని నరేష్ తెలిపారు. ఈ కేసులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, దర్యాప్తును తప్పుదోవ పట్టించారని ఆయన ఆరోపించారు. ఎస్ఐ రమేష్, సీఐ కాంతారెడ్డి కేసును సక్రమంగా విచారించలేదని, నిందితుడికి పోలీసులే అండగా నిలుస్తున్నారని విమర్శించారు. పోలీసులు తమకు న్యాయం చేసేవరకు నిరసన విరమించబోమని నరేష్ స్పష్టం చేశారు..
కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్ చైర్మన్ల నియామకం
Posted On 2026-08-25 17:39:09
Readmore >
రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక
Posted On 2026-08-25 10:02:35
Readmore >
కుసుమ రామయ్య ZPHS విద్యార్థుల NCC క్యాంపు ప్రయాణం - "A" సర్టిఫికెట్ దిశగా అడుగులు
Posted On 2026-08-25 07:42:04
Readmore >
మతం మారాలని సౌజన్యపై సాధిక్ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ
Posted On 2026-08-25 03:53:32
Readmore >
జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం
Posted On 2026-08-24 14:25:56
Readmore >