Posted on 2026-07-11 16:27:29
డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా: బాలికపై లైంగిక వేధింపుల కేసులో పోలీసుల తీరుపై బాధిత కుటుంబం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బాలిక మేనమామ నరేష్ మాట్లాడుతూ.. తమ మేనకోడలిని రాజ్కుమార్ అనే వ్యక్తి లైంగికంగా వేధించాడని, ఈ విషయాన్ని బయటపెడితే చంపేస్తానంటూ రాజ్కుమార్ తమ కుటుంబాన్ని బెదిరించాడని తెలిపారు.
2026 మే 16న షాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ, పోలీసులు దానిని సీరియస్గా తీసుకోలేదని ఆరోపించారు. అంతేకాకుండా, 2025 మార్చి 4న బాలిక తండ్రి మల్లేష్ ఆకస్మికంగా మరణించగా, మల్లేష్ను చంపినట్టే మిమ్మల్నీ చంపుతాను అంటూ నిందితుడు తమ కుటుంబాన్ని బెదిరించాడని నరేష్ తెలిపారు. ఈ కేసులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, దర్యాప్తును తప్పుదోవ పట్టించారని ఆయన ఆరోపించారు. ఎస్ఐ రమేష్, సీఐ కాంతారెడ్డి కేసును సక్రమంగా విచారించలేదని, నిందితుడికి పోలీసులే అండగా నిలుస్తున్నారని విమర్శించారు. పోలీసులు తమకు న్యాయం చేసేవరకు నిరసన విరమించబోమని నరేష్ స్పష్టం చేశారు..
అంతర్జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్లు స్వాధీనం
Posted On 2026-08-08 17:43:12
Readmore >
ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!
Posted On 2026-08-08 17:41:12
Readmore >
రెంట్ ఎ బాయ్ఫ్రెండ్ "డేటింగ్ ట్రాప్".. అమ్మాయిలూ తస్మాత్ జాగ్రత్త... సీపీ సజ్జనార్
Posted On 2026-08-08 14:28:17
Readmore >
తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ!
Posted On 2026-08-08 04:36:39
Readmore >
వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు
Posted On 2026-08-07 16:00:29
Readmore >