Posted on 2026-07-11 05:32:51
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడ గ్రామంలో శనివారం తెల్లవారుజామున జరిగిన మారణహోమం స్థానికంగా కలకలం రేపింది. POCSO కేసులో కక్ష పెంచుకున్న ఓ వ్యక్తి బాలిక కుటుంబంతో పాటు తన సొంత భార్య, ఇద్దరు చిన్నారులను కూడా దారుణంగా హత్య చేశాడు.
పోలీసుల కథనం ప్రకారం, దైవాలగూడకు చెందిన 17 ఏళ్ల మైనర్ బాలికను రాజ్ కుమార్ అనే వ్యక్తి వేధిస్తున్నాడు. ఈ విషయంపై బాలిక తల్లితో కలిసి మే 16న పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు రాజ్ కుమార్పై POCSO చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
బెయిల్పై విడుదలైన తర్వాత రాజ్ కుమార్ కక్షతో రగిలిపోయాడు. శనివారం తెల్లవారుజామున బాలిక ఇంటికి వెళ్లి 65 ఏళ్ల రుక్కమ్మ, 45 ఏళ్ల లక్ష్మీలను హత్య చేశాడు. ఆ తర్వాత బాలికను సమీపంలోని పొలాల్లోకి తీసుకెళ్లి కూడా హత్య చేశాడు.
ఇక్కడితో ఆగకుండా తన ఇంటికి వెళ్లి 30 ఏళ్ల భార్య పార్వతి సరిత, 3 ఏళ్ల కుమారుడు పరీక్షిత్, 2 ఏళ్ల కుమారుడు దైవిక్షిత్లను కూడా చంపేశాడు.
అన్ని హత్యలు చేసిన తర్వాత రాజ్ కుమార్ తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి "6 మందిని చంపేశాను" అని చెప్పి అక్కడి నుంచి పరారయ్యాడు.
సమాచారం అందుకున్న షాబాద్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని 6 మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. భార్యా పిల్లలను ఎందుకు చంపాడనే కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఈ ఘటనతో దైవాలగూడ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్ చైర్మన్ల నియామకం
Posted On 2026-08-25 17:39:09
Readmore >
రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక
Posted On 2026-08-25 10:02:35
Readmore >
కుసుమ రామయ్య ZPHS విద్యార్థుల NCC క్యాంపు ప్రయాణం - "A" సర్టిఫికెట్ దిశగా అడుగులు
Posted On 2026-08-25 07:42:04
Readmore >
మతం మారాలని సౌజన్యపై సాధిక్ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ
Posted On 2026-08-25 03:53:32
Readmore >
జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం
Posted On 2026-08-24 14:25:56
Readmore >