Posted on 2026-06-14 08:30:06
డైలీ భారత్, కామారెడ్డి : విద్యాశాఖ అధికారులు ప్రైవేటు పాఠశాలలను తనిఖీ చేసి అక్రమంగా అడ్మిషన్లు చేసిన ,పుస్తకాలు అమ్మిన, అధిక ఫీజులు వసూలు చేసిన, అలాగే ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తున్న పాఠశాలలను గుర్తింపు రద్దు చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేశారు
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కామారెడ్డి నగర శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు విలేకర్ల సమావేశం నిర్వహించడం జరిగింది. కామారెడ్డి జిల్లా కేంద్రం లో మరియు మండల కేంద్రంలోని ప్రైవేట్ పాఠశాలలు అక్రమంగా అడ్మిషన్స్ జరుపుతూ అధిక ఫీజులు వసూలు చేస్తున, ప్రభుత్వ అనుమతులు లేకుండా 9,10 వ తరగతులకు అడ్మిషన్స్ చేస్తున్నారూ, క్వాలిఫైడ్ టీచర్స్ లేకుండా విద్యార్థులపై కల్తీ విద్య కుట్ర చేస్తున్నారు ప్రభుత్వం అధికారులకు పలుమార్లు విన్నవించుకున్న స్పందించక పోవడం సిగ్గు చేటు ఇప్పుడైనా అధికారులు నిద్ర లేచి ప్రైవేట్ పాఠశాలలో తనిఖీ చేసి గుర్తింపు లేని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం లేకపోతే గాడిదతో డీఈఓ ఆఫీసు ముట్టడిస్తాం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అక్షయ్,కౌశిక్,స్వస్తిక్ , వినయ్ తదితరులు పాల్గొనడం జరిగింది.
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >