Posted on 2026-06-14 09:50:56
డైలీ భారత్, అంతర్గాం: పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం మురుమూరు గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యపై అనుమానంతో భర్త గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన ఘటన గ్రామంలో కలకలం రేపింది. మురుమూరు గ్రామానికి చెందిన నంది రాయమల్లు, ఆయన భార్య లక్ష్మి దంపతులు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. శనివారం తెల్లవారు జామున కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య లక్ష్మిపై అనుమానం పెంచుకున్న రాయమల్లు గొడ్డలితో దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న రామగుండం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వై. కృష్ణ కుమార్, అంతర్గాం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బోయ వెంకటస్వామి సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పరిశీలించి, కుటుంబ సభ్యులను విచారించారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు అంతర్గాం ఎస్ఐ బోయ వెంకటస్వామి తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని పోలీసులు పేర్కొన్నారు.
మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం
Posted On 2026-08-28 17:35:19
Readmore >
నూలు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-08-28 17:25:46
Readmore >
నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు
Posted On 2026-08-28 15:24:06
Readmore >
సీతారామ జలాలను భద్రాద్రి జిల్లాలోని అన్ని మండలాలకు అందించాలి
Posted On 2026-08-28 14:22:50
Readmore >
జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్ కు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన కోడెం సీతా కుమారి
Posted On 2026-08-28 14:19:41
Readmore >
ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి జిల్లా సహాయ కార్యదర్శిగా ఎస్కే చాంద్ పాషా
Posted On 2026-08-28 14:18:02
Readmore >