Posted on 2026-05-16 10:16:16
డైలీ భారత్, బిహార్: మద్య నిషేధం అమలులో ఉన్న బీహార్లో అక్రమ మద్యం రవాణాదారులు కొత్త కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు.
తాజాగా ధన్బాద్ నుంచి పాట్నా వెళ్తున్న గంగా దామోదర్ ఎక్స్ప్రెస్ రైలులో ఏకంగా కంపార్ట్మెంట్ పైకప్పులోనే సుమారు 5 వేల బీర్ టిన్స్ దాచిపెట్టి తరలిస్తుండగా బయటపడింది.
అయితే బోగీ పైకప్పులో దాచిన టిన్స్ ప్రయాణ సమయంలో ఒకదానికొకటి ఢీకొనడంతో కొన్ని లీక్ అయ్యాయి. దీంతో బోగీలో వర్షపు చినుకుల్లా బీర్ కారడం మొదలైంది. అనుమానం వచ్చిన ప్రయాణికులు, రైల్వే సిబ్బంది సమాచారం ఇవ్వడంతో ఈ భారీ స్మగ్లింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
ఇదే రైలులో నెల రోజుల క్రితం కూడా సుమారు 1500 మద్యం క్వార్టర్ బాటిల్స్ పట్టుబడటం గమనార్హం. వరుస ఘటనలతో బీహార్లో రైళ్ల ద్వారా జరుగుతున్న అక్రమ మద్యం రవాణాపై అధికారులు మరింత అప్రమత్తమయ్యారు.
"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం
Posted On 2026-07-14 13:21:15
Readmore >
ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్
Posted On 2026-07-14 12:02:32
Readmore >
సిరిసిల్ల : పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా భాష బోధించాలి... కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-07-14 11:17:33
Readmore >
పల్లెటూరి ప్రజలకు ముఖ్య సమాచారం.. పాము కాటుకు ఇక పై 108 లోను ఇంజక్షన్లు!
Posted On 2026-07-14 03:38:14
Readmore >
కల్లు తాగించి వృద్ధ మహిళల ఆభరణాలు అపహరించిన దొంగ అరెస్ట్, రిమాండ్
Posted On 2026-07-13 18:16:26
Readmore >