| Daily భారత్
Logo




"బార్యాభర్తల మధ్య వివాదాల పరిష్కారానికి ఫ్యామిలీ కౌన్సెలింగ్"

News

Posted on 2026-05-11 14:56:59

Share: Share


"బార్యాభర్తల మధ్య వివాదాల పరిష్కారానికి ఫ్యామిలీ కౌన్సెలింగ్"

అశోక్ నగర్‌లో కార్మికులకు మనోవికాస సదస్సు నిర్వహించిన సైకాలజిస్ట్ కె. పున్నంచందర్

డైలీ భారత్, సిరిసిల్ల: మైండ్ కేర్ అండ్ కౌన్సెలింగ్ సెంటర్ ఆధ్వర్యంలో ఈరోజు అశోక్ నగర్‌లో కార్మికుల కోసం మనోవికాస సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సైకాలజిస్ట్ కె. పున్నంచందర్ పాల్గొని కుటుంబ సంబంధాలు, దాంపత్య జీవితంలో ఏర్పడుతున్న సమస్యలు మరియు వాటి పరిష్కారాలపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా సైకాలజిస్ట్ కె. పున్నంచందర్ మాట్లాడుతూ, ప్రస్తుతం భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలకే గొడవలు పెరిగిపోతున్నాయని తెలిపారు. ముఖ్యంగా ఈగో సమస్యలు, పరస్పర అపార్థాలు, ఒకరిని ఒకరు అర్థం చేసుకోకపోవడం, మితి మీరిన స్వేచ్ఛను కోరుకోవడం వంటి కారణాలు కుటుంబ విభేదాలకు దారితీస్తున్నాయని అన్నారు.

ఇలాంటి సమస్యలు ఎక్కువకాలం కొనసాగితే కుటుంబ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడటమే కాకుండా, పిల్లల మానసిక మరియు భావోద్వేగ ఎదుగుదలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతాయని తెలిపారు.

 కుటుంబంలో శాంతి, పరస్పర గౌరవం, సహనం, ప్రేమతో కూడిన సంభాషణ ఎంతో ముఖ్యమని చెప్పారు.

భార్యాభర్తల మధ్య తలెత్తే వివాదాల పరిష్కారం కోసం మైండ్ కేర్ అండ్ కౌన్సెలింగ్ సెంటర్‌లో ప్రత్యేకంగా ఫ్యామిలీ కౌన్సెలింగ్ సేవలు అందిస్తున్నామని తెలిపారు.

 కౌన్సెలింగ్ ద్వారా పరస్పర అవగాహన పెంపొందించి కుటుంబ బంధాలను బలోపేతం చేయవచ్చని పేర్కొన్నారు.

ఫ్యామిలీ కౌన్సెలింగ్ కోసం  8801888805 ను లేదా మైండ్ కేర్ అండ్ కౌన్సెలింగ్ సెంటర్ లో నేరుగా సంప్రదించవలసిందిగా కార్మికులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో మైండ్ కేర్ అండ్ కౌన్సెలింగ్ సెంటర్ సిబ్బంది బూర శ్రీమతి, కొండ ఉమ, రాపెల్లి లత, కార్మికులు పాల్గొన్నారు.

Image 1

వన మహోత్సవం లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి

Posted On 2026-08-24 15:21:21

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన టాక్స్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్!

Posted On 2026-08-24 14:47:32

Readmore >
Image 1

రేగా కు ఘన స్వాగతం పలికిన నియోజకవర్గ ప్రజలు

Posted On 2026-08-24 14:33:25

Readmore >
Image 1

జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం

Posted On 2026-08-24 14:25:56

Readmore >
Image 1

వేములవాడలో రూ.7.55 కోట్ల రేషన్ బియ్యం స్కామ్...ఇద్దరు అరెస్ట్, ముగ్గురు పరార్

Posted On 2026-08-24 14:24:34

Readmore >
Image 1

యంగ్ ఇండియా పాఠశాలను కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి

Posted On 2026-08-24 14:16:01

Readmore >
Image 1

డిప్యూటీ కలెక్టర్ మద్దినేని మురళిని కలిసిన మద్దిశెట్టి సామేలు

Posted On 2026-08-24 14:10:44

Readmore >
Image 1

జిల్లా పర్యటనకు విచ్చేసిన ఎన్‌సీఎస్‌టీ సభ్యుడు జాతోత్‌ హుస్సేన్‌కు కలెక్టర్‌ అంకిత్‌ ఘన స్వాగతం

Posted On 2026-08-24 14:09:34

Readmore >
Image 1

భర్తను చంపి, అవయవాలు కోసి సంచిలో పెట్టిన భార్య...

Posted On 2026-08-24 06:18:12

Readmore >
Image 1

అంగన్వాడీ భవనం ను వెంటనే నిర్మాణం చేపట్టాలి సిపిఎం

Posted On 2026-08-24 04:57:31

Readmore >