Posted on 2026-05-11 15:05:23
సర్కారు భూమిపై రియల్ ఎస్టేట్ వెంచర్....
విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని బాధితుడి విన్నపం..
ప్రభుత్వ భూమిని కాపాడాలంటూ కలెక్టర్కు వినతిపత్రం..
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని ముష్టిపల్లిలో ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురవుతోందని, దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతూ రాజీవ్ నగర్కు చెందిన కైలాస్ కుమార్ సిరస్వాల్ జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. ముష్టిపల్లిలోని సర్వే నంబర్ 106లో ఉన్న 12.05 గుంటల పట్టా భూమిని ఆనుకుని ఉన్న సర్వే నంబర్ 51లోని సుమారు రెండు 2 ఎకరాల ప్రభుత్వ భూమిని కొంతమంది భూకబ్జాదారులు అక్రమంగా ఆక్రమించారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. గత గ్రామ పంచాయతీ పెద్దలు, మరికొందరు అధికారులు కలిసి ఎటువంటి అనుమతులు లేకుండా, లేఅవుట్ ప్లాన్ లేకుండానే ప్రభుత్వ భూమిలో వెంచర్లు ఏర్పాటు చేసి ప్లాట్ల రూపంలో విక్రయిస్తున్నారని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ స్వప్రయోజనాల కోసం ప్రభుత్వానికి నష్టం కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.వెంటనే సంబంధిత సర్వే నంబర్లలో భూమిని సర్వే చేయించి, అక్రమదారుల నుండి ప్రభుత్వ భూమిని కాపాడి ప్రజా అవసరాలకు వినియోగపడేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను కోరారు.
జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం
Posted On 2026-08-24 14:25:56
Readmore >
వేములవాడలో రూ.7.55 కోట్ల రేషన్ బియ్యం స్కామ్...ఇద్దరు అరెస్ట్, ముగ్గురు పరార్
Posted On 2026-08-24 14:24:34
Readmore >
యంగ్ ఇండియా పాఠశాలను కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి
Posted On 2026-08-24 14:16:01
Readmore >
డిప్యూటీ కలెక్టర్ మద్దినేని మురళిని కలిసిన మద్దిశెట్టి సామేలు
Posted On 2026-08-24 14:10:44
Readmore >
జిల్లా పర్యటనకు విచ్చేసిన ఎన్సీఎస్టీ సభ్యుడు జాతోత్ హుస్సేన్కు కలెక్టర్ అంకిత్ ఘన స్వాగతం
Posted On 2026-08-24 14:09:34
Readmore >