| Daily భారత్
Logo




సిరిసిల్లలో భూకబ్జా ? ...ముష్టిపల్లిలో ప్రభుత్వ భూమి ఆక్రమణపై కలెక్టర్‌కు ఫిర్యాదు..

News

Posted on 2026-05-11 18:35:23

Share: Share


సిరిసిల్లలో భూకబ్జా ? ...ముష్టిపల్లిలో ప్రభుత్వ భూమి ఆక్రమణపై కలెక్టర్‌కు ఫిర్యాదు..

సర్కారు భూమిపై రియల్ ఎస్టేట్ వెంచర్....

విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని బాధితుడి విన్నపం..

ప్రభుత్వ భూమిని కాపాడాలంటూ కలెక్టర్‌కు వినతిపత్రం..

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని ముష్టిపల్లిలో ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురవుతోందని, దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతూ రాజీవ్ నగర్‌కు చెందిన కైలాస్ కుమార్ సిరస్వాల్ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ముష్టిపల్లిలోని సర్వే నంబర్ 106లో ఉన్న 12.05 గుంటల పట్టా భూమిని ఆనుకుని ఉన్న సర్వే నంబర్ 51లోని సుమారు రెండు 2 ఎకరాల ప్రభుత్వ భూమిని కొంతమంది భూకబ్జాదారులు అక్రమంగా ఆక్రమించారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. గత గ్రామ పంచాయతీ పెద్దలు, మరికొందరు అధికారులు కలిసి ఎటువంటి అనుమతులు లేకుండా, లేఅవుట్ ప్లాన్ లేకుండానే ప్రభుత్వ భూమిలో వెంచర్లు ఏర్పాటు చేసి ప్లాట్ల రూపంలో విక్రయిస్తున్నారని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ స్వప్రయోజనాల కోసం ప్రభుత్వానికి నష్టం కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.వెంటనే సంబంధిత సర్వే నంబర్లలో భూమిని సర్వే చేయించి, అక్రమదారుల నుండి ప్రభుత్వ భూమిని కాపాడి ప్రజా అవసరాలకు వినియోగపడేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను కోరారు.

Image 1

విద్యార్థుల్లో నైపుణ్యం వెలికితీసేందుకే సమ్మర్ క్యాంపుల నిర్వహణ : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-05-11 19:12:13

Readmore >
Image 1

ముస్తాబాద్ మండలంలో బెల్ట్‌షాపుల నిర్వాహకుల బైండోవర్

Posted On 2026-05-11 18:58:49

Readmore >
Image 1

సిరిసిల్లలో భూకబ్జా ? ...ముష్టిపల్లిలో ప్రభుత్వ భూమి ఆక్రమణపై కలెక్టర్‌కు ఫిర్యాదు..

Posted On 2026-05-11 18:35:23

Readmore >
Image 1

"బార్యాభర్తల మధ్య వివాదాల పరిష్కారానికి ఫ్యామిలీ కౌన్సెలింగ్"

Posted On 2026-05-11 18:26:59

Readmore >
Image 1

మద్యం మానుకోవచ్చు... (ఎలానో తెలుసుకోండి)

Posted On 2026-05-11 18:25:28

Readmore >
Image 1

గీతా పఠనంలో స్వర్ణ పతకం గెలుచుకున్న సిరిసిల్ల మహిళ

Posted On 2026-05-11 17:23:36

Readmore >
Image 1

బీఆర్ఎస్ పార్టీ నాయకులు మార్కపురి నరసింహారావు ను పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-05-11 16:03:11

Readmore >
Image 1

బూర్గంపాడు మండలం : లక్ష్మీపురం లారీ యార్డు వద్ద వ్యక్తి దారుణ హత్య

Posted On 2026-05-11 16:01:16

Readmore >
Image 1

ఆస్పత్రుల్లో ఫైర్ సేఫ్టీపై కేంద్రం నూతన మార్గదర్శకాలు

Posted On 2026-05-11 15:58:13

Readmore >
Image 1

40 ఏళ్ల రైల్వే రిజర్వేషన్ వ్యవస్థకు గుడ్ బై

Posted On 2026-05-11 15:57:22

Readmore >