Posted on 2026-05-11 18:58:49
డైలీ భారత్, ముస్తాబాద్: ముస్తాబాద్ మండలంలో అక్రమంగా బెల్ట్షాపులు నిర్వహిస్తున్న వారిపై పోలీసులు కొరడా ఝుళిపించారు.సోమవారం ముగ్గురు బెల్ట్షాపు నిర్వాహకులను ముస్తాబాద్ ఎంఆర్ఓ ముందు హాజరుపరిచి బైండోవర్ చేసినట్లు ఎస్ఐ సిహెచ్.గణేష్ ఒక ప్రకటనలో తెలిపారు...
బైండోవర్ అయిన వారిలో చీకోడు గ్రామానికి చెందిన గున్నాల రమేష్ గౌడ్, నామాపూర్ గ్రామానికి చెందిన జలిగం రాజయ్య మరియు యారపు రామస్వామి ఉన్నారు.ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ గ్రామాల్లో నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా బెల్ట్షాపులు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా తహశీల్దార్ ఎదుట బైండోవర్ చేస్తామని స్పష్టం చేశారు. అక్రమ మద్యం విక్రయాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎస్ఐ గణేష్ ఈ సందర్భంగా కోరారు.
మధ్యప్రదేశ్లో మొహర్రం ఊరేగింపులో ప్రమాదకర విన్యాసం.. నలుగురిపై FIR
Posted On 2026-06-26 22:39:46
Readmore >
జినుగు దావీదు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-26 19:31:31
Readmore >
రాజన్న సిరిసిల్ల: అడవులు ఉంటేనే జీవం... డ్రోన్తో విత్తనాలు చల్లుతున్న 7వ తరగతి చిన్నారి
Posted On 2026-06-26 19:19:45
Readmore >
మొహర్రం పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన యువజన నాయకుడు రామిశెట్టి వంశీ
Posted On 2026-06-26 12:01:33
Readmore >