| Daily భారత్
Logo




ఎంపీ వద్దిరాజు ప్రధాని నరేంద్రమోడీకి విజ్ఞప్తి

News

Posted on 2026-05-10 08:24:05

Share: Share


ఎంపీ వద్దిరాజు ప్రధాని నరేంద్రమోడీకి విజ్ఞప్తి

డైలీ భారత్, తెలంగాణ డెస్క్: పాలమూరు-రంగారెడ్డి సాగునీటి పథకానికి జాతీయ హోదా కల్పించడంతో పాటు తెలంగాణ ప్రజల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాల్సిందిగా బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ప్రధానమంత్రి నరేంద్రమోడీకి విజ్ఞప్తి చేశారు.ప్రధాని ఆదివారం హైదరాబాద్ విచ్చేస్తున్న సందర్భంగా ఎంపీ రవిచంద్ర శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు పాలమూరు-రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తూ నిధులు విడుదల  చేయాల్సిందిగా,బయ్యారం ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు ఆమోదం తెల్పాల్సిందిగా, ఖాజీపేటలో రైల్వే మానిఫ్యాక్చరింగ్ యూనిట్ కాకుండా కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటునకు పచ్చజెండా ఊపాల్సిందిగా ఎంపీ రవిచంద్ర ప్రధానమంత్రి మోడీని కోరారు.అదేవిధంగా తెలంగాణలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)నెలకొల్పాలని, గిరిజన యూనివర్సిటీకి మరిన్ని నిధులు విడుదల చేయాలని,మామునూరు, ఆదిలాబాద్ విమానాశ్రయాల నిర్మాణపు పనులను మరింత వేగవంతం చేయాలని ఎంపీ రవిచంద్ర విజ్ఞప్తి చేశారు.దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి శ్రీసీతారామచంద్రస్వామి ఆలయాన్ని సందర్శించే లక్షలాది మంది భక్తుల సౌకర్యార్థం కొత్తగూడెం జిల్లాలో విమానాశ్రయం నిర్మించాలని ఆయన కోరారు. భద్రాచలం రోడ్ (కొత్తగూడెం)రైల్వేస్టేషన్ ఏర్పాటై 2032 నాటికి 100 సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా డివిజన్ ఏర్పర్చాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీకి ఎంపీ వద్దిరాజు విజ్ఞప్తి చేశారు.రాష్ట్రంలో 33 జిల్లాలు ఉండగా జవహర్ నవోదయ పాఠశాలలు కేవలం 16 మాత్రమే ఉన్నాయని,జిల్లాకొకటి చొప్పున మరో 17,రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2 సైనిక్ స్కూల్స్ మంజూరు చేయాల్సిందిగా ఆయన కోరారు.ప్రజల కోరిక మేరకు భద్రాచలం పట్టణాన్ని ఆనుకుని ఉన్న 5 గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాల్సిన అవసరాన్ని తన ప్రకటన ద్వారా ఎంపీ రవిచంద్ర ప్రధాని మోడీ దృష్టికి తెచ్చారు.అలాగే,జనగణన సందర్భంగా కులగణన చేపట్టాలని,చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్స్ కల్పిస్తూ మహిళా రిజర్వేషన్లతో పాటుగా అమలు చేయాల్సిందిగా  ప్రధానమంత్రికి ఆయన విజ్ఞప్తి చేశారు.ఓబీసీల సంక్షేమం, అభ్యున్నతికి కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాల్సిందిగా ఎంపీ వద్దిరాజు ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశారు.

Image 1

దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క

Posted On 2026-06-28 07:18:46

Readmore >
Image 1

సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం

Posted On 2026-06-27 20:20:48

Readmore >
Image 1

ఘనంగా హిందూ సామ్రాజ్య దినోత్సవం

Posted On 2026-06-27 19:10:17

Readmore >
Image 1

ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం

Posted On 2026-06-27 19:06:37

Readmore >
Image 1

ఆర్‌జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర

Posted On 2026-06-27 19:05:50

Readmore >
Image 1

గోపా జిల్లా ఉపాధ్యక్షులుగా నాగరాజ్ గౌడ్

Posted On 2026-06-27 19:04:51

Readmore >
Image 1

పట్టుబడిన / సీజ్ చేసిన 687 కిలోల గంజాయిని దహనం

Posted On 2026-06-27 18:49:05

Readmore >
Image 1

ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేస్తుంది : రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

Posted On 2026-06-27 10:56:55

Readmore >
Image 1

గంటలోనే ముగ్గురు మైనర్ బాలికల ఆచూకీ..

Posted On 2026-06-27 07:16:30

Readmore >
Image 1

పిల్లలకు తప్పనిసరిగా పోలియో టీకా వేయించాలి : మంత్రి దామోదర

Posted On 2026-06-27 07:11:39

Readmore >